హైదరాబాద్లో సెక్స్ రాకెట్ గుట్టు రట్టయ్యింది. ముంబై నుంచి యువతులను రప్పించి, వారితో వ్యభిచారం నడిపిస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. నిర్వాహకుడితో పాటు ఆరుగురు యువతులు, నలుగురు విటులను అరెస్టు చేశారు పోలీసులు. ఈ ఘటన రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. రాజస్థాన్కు చెందిన దీపక్ అనే వ్యక్తి కాటేదాన్లో నివాసం ఉంటున్నాడు. ఉప్పర్పల్లి ప్రాంతంలోని సన్రైజ్ కాలనీలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని, ముంబై నుంచి అందమైన యువతులను రప్పించి వ్యభిచార దందా నడుపుతున్నాడు.
విషయం తెలుసుకున్న పోలీసులు అతడిపై నిఘా పెట్టారు. పక్కా సమాచారం అందుకుని ఆదివారం రాత్రి ఆ ఇంటిపై దాడి చేశారు. ఆరుగురు యువతులు, నలుగురు విటులు, దీపక్ సహా మరో వ్యక్తి ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.