317 జీవోతో ఉద్యోగ, ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. కొందరైతే ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ 317 జీవోను వ్యతిరేకిస్తూ పోరుబాట పట్టింది. హైదరాబాద్ తెలుగుతల్లి ఫ్లైఓవర్ దగ్గర ఉన్న అంబేద్కర్ విగ్రహం దగ్గర ఎమ్మెల్యే సీతక్క, NSUI రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ నిరసనకు దిగారు. 317 జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. వెంకట్ ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమం జరిగింది.
317 జీవో ప్రకారం రికార్డ్ చేయబడిన ఆదివాసి ఉద్యోగులకు స్థానికంగానే బదిలీల ప్రాధాన్యత కల్పించాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ నేతలు. రోస్టర్ విధానం పాటించకుండానే రూల్ ఆఫ్ రిజర్వేషన్ కు తూట్లు పొడిచారని ఆరోపించారు. ఉద్యోగుల ప్రాణాలు తీస్తున్న జీవోను రద్దు చేసి.. టీఆర్ఎస్, బీజేపీ డ్రామాలు ఆపాలని విమర్శించారు. మల్టీ జోనల్ పోస్టుల నిర్ణయాల విషయంలో ఉద్యోగ సంఘాలతో చర్చించి అందరికీ ఆమోదయోగ్యమైన బదిలీలను చేపట్టాలన్నారు.
రాష్ట్రపతి జీవో నెంబర్ 317 ఉత్తర్వులను వెనక్కి తీసుకోవాలన్నారు కాంగ్రెస్ నేతలు. స్థానికత ఆధారంగా రిక్రూట్మెంట్ అయిన ఉద్యోగులకు స్థానికంగానే భద్రత కల్పించాలని చెప్పారు. జోనల్ మల్టీ జోనల్ జిల్లాల సర్దుబాటు చేయాలని డిమాండ్ చేశారు.
శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న సీతక్క, వెంకట్ ను పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేశారు. వెంకట్ ను ముషీరాబాద్ పోలీస్ స్టేషన్ కి, సీతక్క ను నాంపల్లి పీఎస్ కు తరలించారు.
🔥TRS & BJP friendship killed some innocent farmers, unemployed youth now they targeted government employees.
🔥We decided to do hunger strike near the feet of Dr B.R Ambedkar Statue that government should withdraw 317 GO, is this the they treat us? @RahulGandhi @revanth_anumula pic.twitter.com/mjPgIfIsT6— Danasari Anasuya (Seethakka) (@seethakkaMLA) January 12, 2022
Advertisements