రాజ్యసభలో ఈరోజు ఓ అరుదైన ఘటన చోటు చేసుకుంది. పరుగుల రాణి, ఎంపీ పీటీ ఉష.. కొద్ది సేపు రాజ్యసభ ఛైర్మన్ ఛైర్ లో కూర్చుని సభా వ్యవహారాలను పర్యవేక్షించారు. చైర్మన్ జగదీప్ ధన్కర్ సభలో లేని సమయంలో.. ఆమె సభా కార్యక్రమాలను నిర్వహించారు.
సభా కార్యక్రమాలను చూడడం గర్వంగా ఉందని, మరిన్ని మైలురాళ్లను అందుకోనున్నట్లు తన ట్విట్టర్ అకౌంట్లో ఆ ఘటనకు చెందిన వీడియోను పోస్టు చేసింది. ఆమె ఆ వీడియోపై కామెంట్ చేశారు. 2022లో బీజేపీ తరపున రాజ్యసభకు పీటీ ఉష నామినేట్ అయిన విషయం తెలిసిందే.
గొప్ప శక్తి గొప్ప బాధ్యతలో ఉంటుందని ఫ్రాంక్లిన్ డీ రూజ్వెల్ట్కు చెందిన కొటేషన్ను ఆమె తన వీడియోలో పోస్టు చేశారు. ప్రజలు తనపై ఉంచిన బాధ్యత, నమ్మకంతో మరిన్ని మైలురాళ్లు క్రియేట్ చేయనున్నట్లు ఆమె చెప్పారు.
పీటీ ఉష వీడియో పోస్టు చేయగానే ఆమె అభిమానులు కంగ్రాట్స్ మెసేజ్లు చేశారు. మహిళా స్ప్రింటర్గా పీటీ ఉష ఇండియా తరపున ఎన్నో రికార్డులను నెలకొల్పారు. ఏషియన్ గేమ్స్, ఏషియన్ చాంపియన్షిప్, వరల్డ్ జూనియర్ ఇన్విటేషనల్ మీట్లలో పాల్గొన్నారు. తన కెరీర్లో ఎన్నో జాతీయ, ఆసియా రికార్డులను ఆమె నెలకొల్పారు.
"Great power involves great responsibility" as said by Franklin D. Roosevelt was felt by me when I chaired the Rajya Sabha session. I hope to create milestones as I undertake this journey with the trust and faith vested in me by my people.
🎥 @sansad_tv pic.twitter.com/bR8wKlOf21— P.T. USHA (@PTUshaOfficial) February 9, 2023