• Skip to main content
  • Skip to secondary menu
  • Skip to primary sidebar
tolivelugu-logo-removebg-preview

Tolivelugu తొలివెలుగు

Tolivelugu News provide Latest Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, TG and AP News Headlines Live (తెలుగు తాజా వార్తలు), Telugu News Online (తెలుగు తాజా వార్తలు)

tolivelugu facebook tolivelugu twitter tolivelugu instagram tolivelugu tv subscribe nowtolivelugu-app
  • తెలుగు హోమ్
  • వీడియోస్
  • రాజకీయాలు
  • వేడి వేడిగా
  • ఫిలిం నగర్
  • E-Daily
  • చెప్పండి బాస్
  • ENGLISH
Tolivelugu Latest Telugu Breaking News » Hyderabad » డిస్కంల అప్పులకు కారణం అదే.. ప్రభుత్వంపై రేవంత్ ఆగ్రహం

డిస్కంల అప్పులకు కారణం అదే.. ప్రభుత్వంపై రేవంత్ ఆగ్రహం

Last Updated: February 25, 2022 at 5:26 pm

విద్యుత్‌ సంస్థ వైఫల్యానికి రాష్ట్ర ప్రభుత్వం కారణమన్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. కరెంట్ ఛార్జీల పెంపుపై ఈఆర్సీ చేపట్టిన పబ్లిక్ హియరింగ్ కార్యక్రమంలో మాట్లాడారు. డిస్కంల అప్పులు రూ.60 వేల కోట్లకు చేరాయని.. ప్రభుత్వం కూడా ఒక వినియోగదారు అనే అంశాన్ని మర్చిపోతున్నారని గుర్తు చేశారు. ప్రభుత్వం నుంచి బకాయిలు రాబట్టకపోవడంతో అప్పులపాలు అవుతున్నాయని అభిప్రాయపడ్డారు.

ప్రభుత్వం ప్రకటించిన రాయితీలు, పథకాలపై ఛార్జీలను డిస్కంలకు చెల్లించాలని డిమాండ్ చేశారు రేవంత్. ఏటా డిస్కంలకు ప్రభుత్వం రూ.16 వేల కోట్లు చెల్లించాల్సి ఉండగా.. రూ.6 వేల కోట్లు మాత్రమే ఇస్తోందని వివరించారు. డిస్కంలకు ప్రధాన డిఫాల్టర్‌ రాష్ట్ర ప్రభుత్వమేనని విమర్శించారు. పంపిణీ చేస్తున్న కరెంట్ లో 30 శాతం వినియోగదారు ప్రభుత్వమేనని.. విద్యుత్ పంపిణీ సంస్థల చార్జీల పెంపు ప్రతిపాదనలను చర్చకు తావు లేకుండా ఈఆర్సీ తిరస్కరించాలని అన్నారు.

రాష్ట్ర విభజన సమయంలో విద్యుత్ పంపిణీ సంస్థల అప్పులు రూ.11,000 కోట్లు ఉంటే.. రూ.8,900 కోట్ల అప్పు భారాన్ని కేంద్రం తీసుకుందని వెల్లడించారు రేవంత్. ఉదయ్ స్కీమ్‌ లో చేరడంతో డిస్కంల అప్పు రూ.2 వేల కోట్లకు చేరుకుందన్నారు. రాష్ట్ర విభజన తర్వాత ఈఆర్సీ నిర్వహణలో లోపాలు ఉన్నాయని వివరించారు.

బిల్లులు చెల్లించని వినియోగదారులపై చర్యలు తీసుకున్నట్లే రాష్ట్ర ప్రభుత్వంపైనా చర్యలు తీసుకోవాలన్నారు రేవంత్. వినియోగదారులపై భారం మోపే డిస్కంలు.. ప్రభుత్వాన్ని ఎందుకు ఉపేక్షిస్తున్నాయని ప్రశ్నించారు. హైదరాబాద్, సిద్దిపేటలో బకాయిలు ఎక్కువగా ఉన్నాయని… నిర్వహణా లోపం కారణంగా తీగలు వేలాడుతూ ప్రమాదాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదాలు జరుగుతున్న కారణంగా.. వారిపై ఎందుకు క్రిమినల్ కేసులు పెట్టకూడదన్నారు. రాజకీయ బాసుల మెప్పు కోసం సంస్థకు నష్టం చేస్తున్నారని ఆరోపించారు రేవంత్ రెడ్డి.

Primary Sidebar

తాజా వార్తలు

మెట్ల బావి విషాదం.. పెరుగుతున్న మృతుల సంఖ్య

దువ్వ వేణుగోపాలస్వామి ఆలయంలో అపశృతి.. భారీ అగ్నిప్రమాదం!

వాళ్లంతా రామున్ని అర్థం చేసుకోని వ్యక్తులు..!

మరోసారి విద్యుత్ వినియోగంలో రికార్డ్

కరోనాపై రేపు సీఎం సమీక్షా సమావేశం…!

టోల్ ట్యాక్స్ పెంపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి!

ఘనంగా సాగుతున్న శోభాయాత్ర

రాజాసింగ్ కు మరో షాక్

మోడీకి వ్యతిరేకంగా ఆప్ ‘పాన్ ఇండియా’ పోస్టర్ల ప్రచారం..!

దహీ నోటిఫికేషన్ … స్టాలిన్‌ను సమర్థించిన బీజేపీ చీఫ్..!

నేషనల్ హై వే పై క్షణాల్లో బస్సు, స్కూటీ దగ్ధం.. ఒకరి మృతి!

నాటునాటు స్టెప్పులేసిన జీ20 ప్రతినిధులు!

ఫిల్మ్ నగర్

g20 delegates in chandigharh dance to oscar winning naatu naatu

నాటునాటు స్టెప్పులేసిన జీ20 ప్రతినిధులు!

అనుష్క బొద్దుగా మారడానికి కారణం అదేనా?

అనుష్క బొద్దుగా మారడానికి కారణం అదేనా?

senior actor sarat babu hospitalised at chennai

అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన శరత్ బాబు!

ps2 trailer out

పీఎస్‌ 2 ట్రైలర్‌ వచ్చేసింది!

prabhas latest movie adipurush special poster released on ram navami

మంత్రం కన్నా గొప్పది నీ నామం..అంటూ!

మేటరున్న టీజర్ గా ‘మీటర్’ … హిట్ కొట్టనున్న కిరణ్ అబ్బ’వరం’..!

మేటరున్న టీజర్ గా ‘మీటర్’ … హిట్ కొట్టనున్న కిరణ్ అబ్బ’వరం’..!

డిసెంబర్ 22 న ‘సైంధవ్’గా ఫుల్ యాక్షన్ మీల్స్ పెట్టనున్న వెంకీమామ..!

డిసెంబర్ 22 న ‘సైంధవ్’గా ఫుల్ యాక్షన్ మీల్స్ పెట్టనున్న వెంకీమామ..!

బిజినెస్ వుమెన్ గా మారిన సమంత…!?

బిజినెస్ వుమెన్ గా మారిన సమంత…!?

Download Tolivelugu App Now

tolivelugu app download

Copyright © 2023 · Tolivelugu.com

About Us | Disclaimer | Contact Us | Feedback | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap