నిన్న కేరళ..నేడు పంజాబ్. పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా తాజాగా పంజాబ్ అసెంబ్లీ తీర్మానం ఆమోదించింది. దీంతో కేరళ తర్వాత ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానాన్ని ఆమోదించిన రెండో రాష్ట్రం పంజాబ్. మంత్రి బ్రహ్మ్ మొహీంద్ర తీర్మానాన్ని ప్రవేశపెడుతూ…పార్లమెంట్ ఆమోదించిన పౌరసత్వ చట్టం పంజాబ్ తో సహా దేశవ్యాప్తంగా ఆవేశాలకు, సామాజిక అశాంతికి కారణమయ్యాయని అన్నారు. ఈ చట్టం వివక్షపూరితమైనదని…మానవత్వానికి దూరంగా ఉందని చెప్పారు. అంతే కాదు సీఏఏ రాజ్యాంగ మౌళిక సూత్రాలైన సెక్యులర్ అస్థిత్వాన్ని ఉల్లంఘించిందని పేర్కొన్నారు. అందుచేత చట్టానికి వ్యతిరేకంగా తీర్మానాన్ని సభ ఆమోదిస్తుందని తెలిపారు.