‘పుష్ప’మూవీ టీమ్ రష్యాలో సందడి చేశారు. పుష్ప చిత్రం డిసెంబర్ 8న రష్యాలో విడుదల కానున్న తరుణంలో ప్రమోషన్ల కోసం అక్కడికి చేరుకుంది ఈ మూవీ టీమ్. రష్యాలోని ఈ సినిమాని గ్రాండ్గా రిలీజ్ చేస్తున్నారు. ఇటీవల సినిమా ట్రైలర్ ని కూడా రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. దానికి మంచి స్పందన లభించింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, హీరోయిన్ రష్మిక మందన్నా, ప్రొడ్యూసర్ రవిశంకర్, డైరెక్టర్ సుకుమార్, మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీప్రసాద్ రష్యాలో అడుగుపెట్టారు. వీరికి గ్రాండ్ వెల్ కమ్ దక్కింది.
Team #PushpaTheRise Landed in Russia 💥💥
Meet the team at the Russian language Special premieres on Dec 1st at Moscow & Dec 3rd at St. Petersburg 💥💥#PushpaInRussia from Dec 8th 🔥
Icon Star @alluarjun @iamRashmika @aryasukku @ThisIsDSP @MythriOfficial @4SeasonsCreati1 pic.twitter.com/Mt6xucws4h
— Pushpa (@PushpaMovie) November 30, 2022
రష్యాలో `పుష్ప`ని విడుదల చేస్తున్న డిస్ట్రిబ్యూటర్లు వీరికి స్వాగతం పలికారు. తాజాగా ఆ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. శుక్రవారం డిసెంబర్ 1న మాస్కోలో, డిసెంబర్ 3న సెయింట్ పీటర్స్ బర్గ్ లో `పుష్ప` ప్రీమియర్స్ ప్రదర్శించబోతున్నారు. ఇందులో ఈ టీమ్ పాల్గొనబోతుంది. మరోవైపు పలు ప్రమోషన్ కార్యక్రమాల్లోనూ పాల్గొనబోతున్నారని సమాచారం.
`పుష్ప`మూవీ ఇండియాలో భారీ విజయాన్ని సాధించింది. గతేడాది డిసెంబర్ లో విడుదలైన ఈ సినిమాకి మొదట మిశ్రమ స్పందన లభించింది. ల్యాగ్ ఉందని, నిడివి ఎక్కువ ఉందని అన్నారు. కానీ కంటెంట్ కి అదేదీ సమస్య కాదని పుష్ప నిరూపించింది. ఈ చిత్రం భారీ విజయాన్ని సాధించింది. హిందీలోనే ఏకంగా సుమారు 90 కోట్ల రూపాయల్ని వసూలు చేసింది. మొత్తంగా రూ.350 కోట్లకు పైగా కలెక్షన్లని రాబట్టి ఇండస్ట్రీ వర్గాలను, సినిమా యూనిట్ ని షాక్ కి గురి చేసింది.
పుష్ప పార్ వన్ కి వరల్డ్ వైడ్ గుర్తింపు వస్తే.. అది పార్ట్-2కి కూడా ఉపయోగ పడుతుందనే ఉద్దేశంతోనే ‘పుష్ప ది రైజ్’ ని రష్యాలో రిలీజ్ చేస్తున్నారు. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా అక్కడి ఆయడియన్స్ ని ఎంతవరకు ఎట్రాక్ట్ చేస్తుందో చూడాలి.