• Skip to main content
  • Skip to secondary menu
  • Skip to primary sidebar
tolivelugu-logo-removebg-preview

Tolivelugu తొలివెలుగు

Tolivelugu News provide Latest Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, TG and AP News Headlines Live (తెలుగు తాజా వార్తలు), Telugu News Online (తెలుగు తాజా వార్తలు)

tolivelugu facebook tolivelugu twitter tolivelugu instagram tolivelugu tv subscribe nowtolivelugu-app
  • తెలుగు హోమ్
  • వీడియోస్
  • రాజకీయాలు
  • వేడి వేడిగా
  • ఫిలిం నగర్
  • E-Daily
  • చెప్పండి బాస్
  • ENGLISH
Tolivelugu Latest Telugu Breaking News » Top Stories » తండ్రి కనుమూసిన రోజు.. కనుమరుగైన చోటు నుంచే…

తండ్రి కనుమూసిన రోజు.. కనుమరుగైన చోటు నుంచే…

Last Updated: August 21, 2019 at 4:42 pm

విజయవాడ : తన తండ్రి వైఎస్ కనుమూసిన రోజు.. కనుమరుగైన చోటు నుంచి తాను ‘రచ్చబండ’ను ప్రారంభించాలని జగన్ కీలక నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.  సెప్టెంబర్ 2 నుంచి చిత్తూరు జిల్లాలో ఈ రచ్చబండ కార్యక్రమం జరపాలని ప్రాథమికంగా ఒక నిర్ణయానికి వచ్చారు. క్షేత్రస్థాయిలో ప్రజా సమస్యలు తెలుసుకోవడమే లక్ష్యంగా ‘రచ్చబండ’ నిర్వహించాలని ముఖ్యమంత్రి భావిస్తున్నట్టు తెలుస్తోంది.  నాడు ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ రాజశేఖరరెడ్డి చిత్తూరు జిల్లాలో ‘రచ్చబండ’ పేరుతోనే ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకోవాలని బయలుదేరి.. నల్లమల అడవుల్లో ఘోర ప్రమాదానికి గురై అసువులు బాశారు. దీంతో ఆ కార్యక్రమం జోలికి మరే ముఖ్యమంత్రి పోలేదు. ఇప్పుడు తండ్రి ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలన్నఉద్దేశంతో ఉన్న వైఎస్ జగన్.. ఆ రచ్చబండ కార్యక్రమాన్ని తిరిగి ప్రారంభించాలన్న సంకల్పంతో ఉన్నారు.

వైఎస్ రాజశేఖరరెడ్డి మరణించిన సెప్టెంబర్ 2 నుంచి చిత్తూరు జిల్లాలో ఈ కార్యక్రమం ప్రారంభమవుతుందని సీఎంఓ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం జగన్ అమెరికాలో ఉండగా, ఆయన తిరిగి రాగానే పర్యటన షెడ్యూల్ ఖరారవుతుందని సమాచారం. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రిగా తొలిసారి జగన్ ప్రజల్లోకి వెళ్లినట్టు అవుతుంది. తన పాదయాత్రలో భాగంగా కోట్లాదిమందిని దగ్గర నుంచి చూసిన జగన్..  వారి సమస్యలను మరింత లోతుగా చర్చించేందుకు రచ్చబండను వినియోగించుకోవాలని భావిస్తున్నట్టు పార్టీ నేతలు అంటున్నారు.

ప్రభుత్వ పథకాల అమలుతీరు, గ్రామ వాలంటీర్ల విధానం, ప్రభుత్వం గ్రామాల అభివృద్ధి కోసం తీసుకోవాల్సిన చర్యలపై ముఖ్యమంత్రి క్షేత్ర స్థాయిలో అభిప్రాయాలను తీసుకోనున్నారు.

ఈ కార్యక్రమం అన్ని జిల్లాల్లోని ఎంపిక చేసిన కొన్ని గ్రామాల్లో కొనసాగుతుందని సమాచారం.

Primary Sidebar

తాజా వార్తలు

ఫైజల్ కు ఉపశమనం… నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్న లోక్ సభ సచివాలయం..!

స్వప్నలోక్ కాంప్లెక్స్ అగ్నిప్రమాదం కేసులో ఇద్దరు అరెస్ట్

రామనవమి యాత్రపై బాంబు దాడులకు స్కెచ్..నేనే వాళ్ల టార్గెట్!

కాకతీయ యూనివర్సిటీలో హై టెన్షన్!

రెండోరోజు.. ఈడీ ఆఫీస్ కి సోమా భరత్

దారుణం.. ఆ కారణంతోనే తండ్రిని హత్య చేసిన కొడుకు

వయనాడ్ ఉప ఎన్నికపై సీఈసీ కీలక వ్యాఖ్యలు..!

మోడీ సర్కార్ కుటిల నీతి దీంతో బయటపడింది!

కేటీఆర్ పై కుట్రలు.. గుత్తా సంచలన వ్యాఖ్యలు

మేరా ఘర్ శ్రీ రాహుల్ గాంధీజీ కా ఘర్… ఇంటికి కాంగ్రెస్ నేత పోస్టర్..!

మోగిన ఎన్నికల నగారా…!

తాప్సీపై కేసు పెట్టిన ఎమ్మెల్యే కొడుకు

ఫిల్మ్ నగర్

తాప్సీపై కేసు పెట్టిన ఎమ్మెల్యే కొడుకు

తాప్సీపై కేసు పెట్టిన ఎమ్మెల్యే కొడుకు

'వీర సింహారెడ్డి' ఫేమ్ హనీ రోజ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

‘వీర సింహారెడ్డి’ ఫేమ్ హనీ రోజ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

బాలీవుడ్ పై బాంబేసిన హాలీవుడ్ బ్యూటీ!

బాలీవుడ్ పై బాంబేసిన హాలీవుడ్ బ్యూటీ!

అభిమానులను  అలరిస్తున్న  ఆదిపురుష్  అప్ డేట్ ...!

అభిమానులను అలరిస్తున్న ఆదిపురుష్ అప్ డేట్ …!

మరో మాలీవుడ్ రీమేక్ కి... సై అంటున్న షాహిద్ కపూర్..!

మరో మాలీవుడ్ రీమేక్ కి… సై అంటున్న షాహిద్ కపూర్..!

రాఘవ్ చద్దా, పరిణీతి చోప్రా  జంట  ఓ ఇంటిదవుతుందట...!

రాఘవ్ చద్దా, పరిణీతి చోప్రా జంట ఓ ఇంటిదవుతుందట…!

నల్లకోటులో రవితేజ నటవిశ్వరూపం ‘రావణాసుర’..ట్రైలర్  టెర్రిఫిక్ గా  ఉంది..!

నల్లకోటులో రవితేజ నటవిశ్వరూపం ‘రావణాసుర’..ట్రైలర్ టెర్రిఫిక్ గా ఉంది..!

హీరో బెల్లంకొండ శ్రీనివాస్ సినిమా... వరల్డ్ రికార్డ్  కొట్టిందంట..!

హీరో బెల్లంకొండ శ్రీనివాస్ సినిమా… వరల్డ్ రికార్డ్ కొట్టిందంట..!

Download Tolivelugu App Now

tolivelugu app download

Copyright © 2023 · Tolivelugu.com

About Us | Disclaimer | Contact Us | Feedback | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap