మంత్రి బొత్స సత్యన్నారాయణ పై నిప్పులు చెరిగారు వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణం రాజు. ఢిల్లీ లో మీడియా తో మాట్లాడిన ఆయన అయ్యా సత్తిబాబు గారూ నాకు సరదాగా రాజీనామా చేయాల్సిన అవసరం లేదు. ఇలాంటి చవకబారు వ్యాఖ్యలు దయచేసి మాట్లాడవద్దు. ఇప్పుడంటే మీరు ఓ ప్రాంతీయ పార్టీలో మంత్రిగా ఉన్నారు. అంతకుముందు కాంగ్రెస్ వంటి జాతీయ పార్టీలో ఉన్నారు. ప్రజల్లో మీరంటే గౌరవం ఉంది. మీలో నేను ఓ గొప్ప స్నేహితుడ్ని, పరిణతి చెందిన రాజకీయ నాయకుడ్ని చూశాను. నాకూ మీపట్ల ఎంతో గౌరవం ఉంది. నేను ఎలా గెలిచినో మీకు తెలుసు. నేను పార్టీలోకి ఎలా వచ్చానో మీకు తెలుసు. నేనెలా వచ్చానో సీఎం జగన్ కు కూడా తెలుసు.
ఏదైనా ఉంటే సీఎం జగన్ నేనూ చూసుకుంటాం. మధ్యలో ప్రతివాడు వాగొద్దు. మీకేదో మంత్రి పదవి ఉందని నోటికొచ్చింది వాగేస్తారా? ఇప్పుడంటే జగన్ సీఎం… అంతకుముందు నాకూ జగన్ కు మధ్య ఏం చర్చ జరిగిందో మీకు తెలుసా… అసలు గతంలో నాకూ జగన్ కు మధ్య ఏమున్నాయో మీకు తెలుసా? ఎందుకు ఊరికే నోరు పారేసుకుంటారు? ముందేమో రాజీనామా చేయమంటారా..? ఓకే చాలెంజ్ అంటే చేసుకుంటే చేసుకో నాకేంటి సంబంధం అంటారా..?వద్దు… నా గురించి మీరసలు మాట్లాడొద్దు. ఏదైనా ఉంటే నేను, సీఎం జగన్ చూసుకుంటాం. దయచేసి మంత్రులు చవకబారు ప్రకటనలు చేయకండి.
నా జోలికి రాకండి. మీరెలా నెగ్గారో, నేనూ అలాగే నెగ్గాను. కాకపోతే మీరు మాకేమీ ఫేస్ లేదు, మేం ఆ ఫేస్ తోనే నెగ్గామని చెప్పుకుంటున్నారు. నేను మాత్రం నా ఫేస్ తోనే నెగ్గానని దమ్ము, ధైర్యంగా చెప్పుకుంటున్నా”