బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థినులను వేధిస్తున్నారన్న ఆరోపణలపై ఇద్దరు కాలేజీ ఉద్యోగులను సస్పెండ్ చేశారు. అకౌంట్ సెక్షన్కి చెందిన ఇద్దరు ఉద్యోగులను.. ఇంచార్జ్ విసి వెంకటరమణ సస్పెండ్ చేశారు. విధులు ఉల్లంఘన, యూనివర్సిటీకి సంబందించిన విషయాలు బయటికి లీక్ చేస్తున్నారని వారిపై చర్యలు తీసుకున్నారు.
అలాగే.. ఓ విద్యార్థినిని వేధిస్తున్నారని వీరిపై ఆరోపణలు వచ్చాయి. బాధిత విద్యార్థిని ఫిర్యాదుతో విచారణ కొనసాగుతుండగానే ఇద్దరు ఉద్యోగులపై ఇంచార్జి వీసీ సస్పెన్షన్ వేటు వేశారు. అయితే.. దీనిపై పూర్తిస్థాయి నివేదిక సోమవారం రానుంది. నివేదిక వచ్చిన వెంటనే ఇద్దరు ఉద్యోగులపై తదుపరి చర్యలు తీసుకోనున్నారు.
అంతే కాకుండా ఇటీవల జరిగిన ర్యాగింగ్ ఘటనకు కారణమైన ఐదుగురు విద్యార్థులపై వీసీ చర్యలు తీసుకున్నారు. 15 రోజుల పాటు తరగతులకు హాజరుకాకుండా సస్పెండ్ చేయడంతో పాటు చివరి సెమిస్టర్పరీక్షలకు అనర్హులుగా ప్రకటిస్తూ వీసీ వెంకటరమణ ఆదేశాలు జారీ చేశారు. ఇటీవల పీయూసీ ఫస్ట్ ఇయర్, సెకండ్ఇయర్ విద్యార్థుల మధ్య ఘర్షణ జరిగిన సంగతి తెలిసిందే.
దీంతో ఫస్ట్ఇయర్ విద్యార్థులు సెకండ్ఇయర్ విద్యార్థులపై ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో వర్సిటీ ఆఫీసర్లు క్రమశిక్షణ కమిటీ, ర్యాగింగ్కమిటీలను ఏర్పాటు చేసి పలు దఫాలుగా విచారణ జరిపించారు. ఆ కమిటీల నివేదిక ఆధారంగా ఐదుగురు విద్యార్థులకు పనిష్మెంట్ ఇచ్చారు.