• Skip to main content
  • Skip to secondary menu
  • Skip to primary sidebar
tolivelugu-logo-removebg-preview

Tolivelugu తొలివెలుగు

Tolivelugu News provide Latest Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, TG and AP News Headlines Live (తెలుగు తాజా వార్తలు), Telugu News Online (తెలుగు తాజా వార్తలు)

tolivelugu facebook tolivelugu twitter tolivelugu instagram tolivelugu tv subscribe nowtolivelugu-app
  • తెలుగు హోమ్
  • వీడియోస్
  • రాజకీయాలు
  • వేడి వేడిగా
  • ఫిలిం నగర్
  • E-Daily
  • చెప్పండి బాస్
  • ENGLISH
Tolivelugu Latest Telugu Breaking News » National » దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థలన్నీ కుప్పకూలిపోయాయి…!

దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థలన్నీ కుప్పకూలిపోయాయి…!

Last Updated: February 21, 2023 at 6:27 pm

దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థలన్నీ కుప్పకూలిపోయాయని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. దేశంలో కేంద్రీకృత విధానాలే సంపూర్ణంగా అమలవుతున్నాయన్నారు. దేశంలో పత్రికా స్వేచ్ఛ లేదని ఆయన ఆరోపించారు. ప్రస్తుతం దేశంలో ఫాసిజం రాజ్యమేలుతోందని ఆయన మండిపడ్డారు.

ఇటాలియన్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ… దేశంలో పార్లమెంట్ పని చేయడం లేదేన్నారు. తాను రెండేళ్ళుగా మాట్లాడలేకపోతున్నానని ఆయన పేర్కొన్నారు. తాను మాట్లాడిన వెంటనే వాళ్ళు తన మైక్రోఫోన్‌ను ఆఫ్ చేసేస్తారని చెప్పారు. అధికారాల సమతుల్యత లేదన్నారు.

దేశంలో హిందూ ముస్లింల మధ్య పోలరైజేషన్ ఉందన్నారు. కానీ ప్రభుత్వ మద్దతుగల మీడియా ప్రచారం చేస్తున్నంత తీవ్రంగా మాత్రం లేదని వివరించారు. ద్రవ్యోల్బణం, పేదరికం, నిరక్ష రాస్యత, కొవిడ్ మహమ్మారి తర్వాత చిన్న తరహా, రుణగ్రస్థులైన వ్యాపారులు, భూమిలేని రైతులు ఎదుర్కొంటున్న కష్టాలు వంటి సమస్యలనుంచచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు దాన్ని ఓ సాధనంగా వాడుకుంటున్నారని ఆయన మండిపడ్డారు.

ప్రస్తుతం కేంద్రీకృత విధానాలే అమలవుతున్నాయన్నారు. న్యాయ వ్యవస్థ స్వతంత్రంగా లేదని ఆరోపించారు. ఇక భారత్ జోడో యాత్ర గురించి స్పందిస్తూ.. ఆ యాత్ర ఓ తపస్సు లాంటిదన్నారు. తనతో సహా ప్రతి ఒక్కరి పరిమితులు మనం అనుకున్నదాని కన్నా చాలా ఎక్కువ అని పేర్కొన్నారు.

సంస్కృతంలో తపస్య అని ఉందని దాన్ని పాశ్చాత్య మేధావులు అర్థం చేసుకోవడం చాలా కష్టమని చెప్పారు. దీన్ని చాలా మంది ‘త్యాగం’, ‘సహనం’ అంటూ అనువాదం చేస్తారని అన్నారు. కానీ దాని అర్థం తాపాన్ని సృష్టించడమని ఆయన వివరించారు. తాను నిర్వహించిన యాత్ర తాపాన్ని సృష్టించేదని కాదన్నారు. మీ లోపలికి మీరు చూసుకునేలా చేస్తుందన్నారు.

ప్రతిపక్షాలన్నీ ఏకమైతే రాబోయే ఎన్నికల్లో బీజేపీని ఓడించడం నూటికి నూరు శాతం సాధ్యమేనని ఆయన తేల్చి చెప్పారు. రైట్ లేదా లెఫ్ట్ కానటువంటి విజన్‌ను వ్యతిరేకిస్తే ఇది సాధ్యమవుతుందని వెల్లడించారు. శాంతి, సమైక్యతల కోసం మోడీని ఓడించవచ్చునని ఆయన అన్నారు. ఓ ప్రత్యామ్నాయాన్ని చూపిస్తే ఫాసిజం ఓడిపోతుందని ఆయన తెలిపారు. భారత దేశపు రెండు దార్శనికతలు ఒకదానితో మరొకటి పోటీ పడితే, తమదే ఆధిపత్యమని చెప్పారు.

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం విదేశాంగ విధానానికి సంబందించినదన్నారు. కానీ దానికి శాంతియుత పరిష్కారాలు అవసరమన్నారు. ప్రధాని నెహ్రూ తనకు తెలియదన్నారు. కానీ ఆయన్ని తన మార్గదర్శకుడిగా భావిస్తానని చెప్పారు. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ తనను ఎంతో ఆత్మీయంగా చూసేవారని చెప్పారు.

తనకు బచ్చలి కూర, బఠాణీలు అంటే ఇష్టం ఉండదన్నారు. కానీ అన్ని కూరలు తినాలని తన తండ్రి రాజీవ్ గాంధీ కట్టుదిట్టంగా వ్యవహరించేవారని చెప్పారు. ఆ సమయంలో ఇందిరా గాంధీ ఓ వార్తాపత్రికను తనకు చూపించే వారని, ఆ పత్రిక చదవమనేవారన్నారు. ఆ సమయంలో పత్రిక మాటున తాను తన పళ్లెంలోని బచ్చలి కూర, బఠాణీలను ఆమె పళ్లెంలో పెట్టేసేవాడినని తెలిపారు.

ఇందిర గాంధీకి ఆమె మరణం గురించి తెలుసునని చెప్పారు. తాను మరణించిన రోజు నువ్వు ఏడవద్దని, కనీసం బహిరంగంగా ఏడవద్దంటూ సూచించారని అన్నారు. రాజీవ్ గాంధీకి కూడా ఆయన మరణం గురించి ఆయనకు తెలుసునన్నారు. ఆయన్ని చంపేది తమిళ టైగర్స్ అని ఆయనకు తెలుసో, లేదో తనకు తెలియదన్నారు. కానీ తన ప్రాణాలకు ముప్పు కలిగించే శక్తులు, ప్రయోజనాలు, బలగాలు ఏకమవుతున్నాయని ఆయన భావించారని చెప్పారు.

మీ ప్రాణం గురించి మీరు భయపడుతున్నారనే వార్తలపై మీరేమంటారన్న దానిపై ఆయన మాట్లాడుతూ…. అది భయపడే విషయం కాదన్నారు. తానేం చేయాలో అది చేస్తానని చెప్పారు. తనకు పిల్లలుండటాన్ని ఇష్టపడతానన్నారు. అయితే 52 ఏళ్ళు వచ్చినా తాను ఇంకా ఎందుకు వివాహం చేసుకోలేదనేదానిపై ఖచ్చింతంగా చెప్పలేనన్నారు.

Primary Sidebar

తాజా వార్తలు

కేటీఆర్, బండి సంజయ్ ల ఉగాది పంచాంగం..!

భద్రాద్రి బ్రహ్మోత్సవాలు.. కేసీఆర్, గవర్నర్ లకు ఆహ్వానం

భారంగా మారిన వైద్యు ఖర్చులు.. యువకుడి బలవన్మరణం..!

పేపర్ల లీకేజీ కేసులో 42 మందికి సిట్ నోటీసులు

ఈడీ విచారణ తర్వాత.. కవిత కౌంటర్ వీడియో!

కొడుకు పెళ్ళి కోసం యజమాని ఇంటికి కన్నం…!

గురుద్వారాలో చొరబడి.. అమృత్ పాల్ ‘విలనిజం’ !

టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీపై బీజేపీ సంచలన నిర్ణయం

మన్ కీ బాత్ 100వ ఎపిసోడ్.. ప్రపంచ వ్యాప్తంగా ప్రసారానికి ఏర్పాట్లు..!

పెరుగుతున్న కరోనా కేసులు.. మోడీ సమీక్ష

కేసీఆర్ తో కవిత భేటీ.. ఈడీ విచారణపై చర్చ!

సమస్యలు పట్టించుకోకుండా గాలికి తిరుగుతున్నాడు!!

ఫిల్మ్ నగర్

ఈ సారి మీ ఊహకు మించి అంటూ.. NBK108 ఫస్ట్ లుక్!

ఈ సారి మీ ఊహకు మించి అంటూ.. NBK108 ఫస్ట్ లుక్!

భగత్ సింగ్ లోనా..నేనా..! వట్టిరూమర్స్ బాస్..!!

భగత్ సింగ్ లోనా..నేనా..! వట్టిరూమర్స్ బాస్..!!

యోగా ప్రాక్టీస్ తో అల్లుఅర్జున్ కి షాకిచ్చిన అర్హ..!

యోగా ప్రాక్టీస్ తో అల్లుఅర్జున్ కి షాకిచ్చిన అర్హ..!

ఉగాది సందర్భంగా భోళాశంకర్ కంటెట్ పోష్టర్ ....!

ఉగాది సందర్భంగా భోళాశంకర్ కంటెట్ పోష్టర్ ….!

సామ్ యాజ్ బ్యూటీ ఇన్ బ్లాక్ ...ఎందుకబ్బా...!?

సామ్ యాజ్ బ్యూటీ ఇన్ బ్లాక్ …ఎందుకబ్బా…!?

అసత్య ప్రచారం చేస్తున్న యూట్యూబ్ ఛానెళ్ళపై....నటి హేమ కంప్లైంట్ ..!

అసత్య ప్రచారం చేస్తున్న యూట్యూబ్ ఛానెళ్ళపై….నటి హేమ కంప్లైంట్ ..!

‘పాపులర్ సెలెబ్రిటీస్’లిస్ట్ లో టాప్ కి చరణ్...చేజార్చుకున్న కోహ్లీ..!

‘పాపులర్ సెలెబ్రిటీస్’లిస్ట్ లో టాప్ కి చరణ్…చేజార్చుకున్న కోహ్లీ..!

పాయల రాజ్ పుత్ కు హెల్త్ ప్రాబ్లమ్....!?

పాయల రాజ్ పుత్ కు హెల్త్ ప్రాబ్లమ్….!?

Download Tolivelugu App Now

tolivelugu app download

Copyright © 2023 · Tolivelugu.com

About Us | Disclaimer | Contact Us | Feedback | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap