కర్ణాటకలో భారత్ జోడో యాత్ర కొనసాగుతోంది. నేటితో యాత్ర 32వ రోజుకు చేరుకుంది. తుమ్మూరు జిల్లాలో రాహుల్ గాంధీ పాద యాత్ర చేస్తున్నారు.
పోచ్ కట్టె గ్రామంలో పాదయాత్రను రాహుల్ గాంధీ ఈ రోజు ప్రారంభించారు. పాదయాత్రలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
పాదయాత్రలో స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకుంటూ రాహల్ గాంధీ ముందుకు సాగుతున్నారు. దేశాన్ని ఐక్యంగా ఉంచేందుకే ఈ యాత్రను చేస్తున్నామని ఇందులో ప్రతి ఒక్కరూ పాల్గోవాలని రాహుల్ పిలుపునిచ్చారు.
భారత్ జోడో యాత్రను గత నెల 7న తమిళనాడులోని కన్యాకుమారిలో రాహుల్ గాంధీ ప్రారంభించారు. తమిళనాడు, కేరళల మీదుగా యాత్ర కర్ణాటకలోకి ప్రవేశించింది.
యాత్రలో భాగంగా 150 రోజుల పాటు దాదాపు 12 రాష్ట్రాల మీదుగా జమ్ము కశ్మీర్ వరకు పాదయాత్ర చేయనున్నారు. మొత్తం 3 వేల 500 కిలోమీటర్లు వరకు రాహుల్ గాంధీ పాదయాత్ర చేయనున్నారు.