బీజేపీ ప్రభుత్వంపై కాంగ్రెస్ సీనియర్ నేత మరోసారి ట్విట్టర్లో ఫైర్ అయ్యారు. లాక్డౌన్ సమయంలో కార్మికుల మరణాలకు సంబంధించిన గణాంకాలు తమ వద్ద లేవని కేంద్ర ప్రభుత్వం చెప్పడంపై విమర్శలు గుప్పించారు. ఈ మేరకు ఓ ట్వీట్ చేశారు.
లాక్డౌన్ కాలంలో ఎంత మంది వలస కార్మికులు మరణించారో, ఎన్ని ఉద్యోగాలు పోయాయో మోదీ ప్రభుత్వానికి తెలియదు. వలస కార్మికుల మరణాలను ప్రపంచం మొత్తం చూసింది కానీ.. మోదీ ప్రభుత్వానికి అది కనిపించలేదు. వారి మరణాతో ప్రభావం ప్రభుత్వంపై అసలే పడలేదు. మోదీ ప్రభుత్వం లెక్కించనంత మాత్రాన ప్రాణాలు పోనట్టేనా.. అని ట్విట్టర్లో ప్రశ్నించారు.
मोदी सरकार नहीं जानती कि लॉकडाउन में कितने प्रवासी मज़दूर मरे और कितनी नौकरियाँ गयीं।
तुमने ना गिना तो क्या मौत ना हुई?
हाँ मगर दुख है सरकार पे असर ना हुई,
उनका मरना देखा ज़माने ने,
एक मोदी सरकार है जिसे ख़बर ना हुई।— Rahul Gandhi (@RahulGandhi) September 15, 2020
రాహుల్ గాంధీ ప్రస్తుతం విదేశాల్లో ఉన్నారు. ఆరోగ్య పరీక్షల కోసం వెళ్లిన సోనియాకు తోడుగా ఆయన కూడా విదేశాలకు వెళ్లారు.