• Skip to main content
  • Skip to secondary menu
  • Skip to primary sidebar
tolivelugu-logo-removebg-preview

Tolivelugu తొలివెలుగు

Tolivelugu News provide Latest Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, TG and AP News Headlines Live (తెలుగు తాజా వార్తలు), Telugu News Online (తెలుగు తాజా వార్తలు)

tolivelugu facebook tolivelugu twitter tolivelugu instagram tolivelugu tv subscribe nowtolivelugu-app
  • తెలుగు హోమ్
  • వీడియోస్
  • రాజకీయాలు
  • వేడి వేడిగా
  • ఫిలిం నగర్
  • E-Daily
  • చెప్పండి బాస్
  • ENGLISH
Tolivelugu Latest Telugu Breaking News » Top News » 2024 ఎన్నికల్లో రాహుల్ విపక్ష పీఎం అభ్యర్థి.. కమల్ నాథ్

2024 ఎన్నికల్లో రాహుల్ విపక్ష పీఎం అభ్యర్థి.. కమల్ నాథ్

Last Updated: December 30, 2022 at 9:06 pm

 

2024 లో జరిగే లోక్ సభ ఎన్నికల్లో తమ నేత రాహుల్ గాంధీ విపక్ష ప్రధానమంత్రి అభ్యర్థిగా పోటీ చేస్తారని కాంగ్రెస్ సీనియర్ నేత, మధ్యప్రదేశ్ మాజీ సీఎం కమల్ నాథ్ ప్రకటించారు. రాహుల్ చేబట్టిన భారత్ జోడో పాదయాత్ర గురించి ప్రస్తావిస్తూ ఆయన.. రాహుల్ అధికారం కోసం రాజకీయాలు చేయడం లేదని, ఈ దేశ సామాన్యప్రజలకోసం చేస్తున్నారని అన్నారు. దేశ సమైక్యతే ఆయన లక్ష్యమన్నారు. 2024 లోక్ సభ ఎన్నికలకు సంబంధించినంతవరకు రాహుల్ విపక్ష నేతగానే కాక.. ప్రధానమంత్రి అభ్యర్థి కూడా అని కమల్ నాథ్ ఓ వార్తా సంస్థకు ఈ-మెయిల్ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

Rahul Gandhi To Be Opposition's Prime Ministerial Face In 2024 Polls:  Congress' Kamal Nath

ప్రపంచ చరిత్రలో ఏ నాయకుడూ ఇంత సుదీర్ఘ పాదయాత్ర చేయలేదని, గాంధీ కుటుంబం తప్ప మరే కుటుంబమూ దేశం కోసం ఇన్ని త్యాగాలు చేయలేదని ఆయన అన్నారు. అధికారం కోసం రాహుల్ పాలిటిక్స్ పాదయాత్ర చేయడం లేదని, గద్దెపై ఎవరినైనా కూర్చోబెట్టగలిగే ఈ దేశ ప్రజల కోసం చేస్తున్నారని ఆయన చెప్పారు.

2024 ఎన్నికల్లో విపక్ష ప్రధాని అభ్యర్థిగా రాహుల్ పోటీ చేయాలని కమల్ నాథ్ ఒక్కరే ప్రతిపాదన చేస్తున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు. సంస్థకు ద్రోహం చేసినవారికి పార్టీలో స్థానం లేదని కమల్ నాథ్ వ్యాఖ్యానించారు. భవిష్యత్తులో కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తిరిగి కాంగ్రెస్ లో చేరే అవకాశాలున్నాయా అన్న ప్రశ్నకు ఆయన.. ఏ వ్యక్తి గురించీ తాను ప్రస్తావించబోనని, కానీ పార్టీకి ద్రోహం చేసి కార్యకర్తల విశ్వాసాన్ని భంగపరచిన వారికి పార్టీలో స్థానం లేదని చెప్పారు.

మధ్యప్రదేశ్ లో మళ్ళీ కాంగ్రెస్ అధికారం లోకి వచ్చిన పక్షంలో పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరిస్తామని కమల్ నాథ్ పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీలో సంస్థాగత మార్పులు జరుగుతాయని ఆయన తెలిపారు. వచ్చే ఏడాది మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.

Primary Sidebar

తాజా వార్తలు

తండ్రికి తగ్గ తనయుడు.. హిమాన్షుపై ప్రశంసలు..!

ముగిసిన ఎంపీ అవినాష్ రెడ్డి సీబీఐ విచారణ

హిండెన్ బర్గ్ రిపోర్ట్: కేటీఆర్, కవితల రియాక్షన్

ముందస్తు హింట్.. సెంట్రల్ కు స్ట్రయిట్ సవాల్

పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపై శ్వేతపత్రం విడుదల చేయాలి

ప్రచారం, ప్రకటనలపై ఏ పార్టీ ఎంత ఖర్చు చేసిందంటే…!

వేలాది మంది భర్తలను కటాకటాల్లోకి నెడతాం….!

మరి మిగతా ధర్మాల మాటేమిటి… సీఎం యోగిపై కాంగ్రెస్ నేత ఫైర్…!

రవితేజ ఉండే ఇల్లు ఖరీదు ఎంతో తెలుసా…?

విజయసాయి రెడ్డికి, తారకరత్నకు ఉన్న రిలేషన్ తెలుసా…?

జమున ఆస్తులు ఎన్నో తెలుసా…?

రజనీ కాంత్ కి ఆ రెండు అలవాట్లు ఉండేవా…? లతా వచ్చిన తర్వాత ఏం జరిగింది…?

ఫిల్మ్ నగర్

ఇంకా విషమంగానే తారకరత్న ఆరోగ్యం!

ఇంకా విషమంగానే తారకరత్న ఆరోగ్యం!

తారకరత్నకు ఎక్మో వైద్యం.. సాయంత్రం బెంగళూరుకి చంద్రబాబు, ఎన్టీఆర్‌, కళ్యాణ్‌రామ్‌!

తారకరత్నకు ఎక్మో వైద్యం.. సాయంత్రం బెంగళూరుకి చంద్రబాబు, ఎన్టీఆర్‌, కళ్యాణ్‌రామ్‌!

వసూళ్లను 'హంట్' చేయలేకపోయింది!

వసూళ్లను ‘హంట్’ చేయలేకపోయింది!

దసరా 2 భాగాలుగా వస్తోందా?

దసరా 2 భాగాలుగా వస్తోందా?

పవన్ సినిమాకు ముహూర్తం ఫిక్స్

పవన్ సినిమాకు ముహూర్తం ఫిక్స్

బుల్లితెరపై మెరిసిన గాడ్ ఫాదర్

బుల్లితెరపై మెరిసిన గాడ్ ఫాదర్

ధోనీ కొత్త ఇన్నింగ్స్ మొదలుపెట్టాడు!

ధోనీ కొత్త ఇన్నింగ్స్ మొదలుపెట్టాడు!

అన్ స్టాపబుల్-2: మూడు పెళ్లిళ్ల గొడవ ఏంటయ్యా?

అన్ స్టాపబుల్-2: మూడు పెళ్లిళ్ల గొడవ ఏంటయ్యా?

Download Tolivelugu App Now

tolivelugu app download

Copyright © 2023 · Tolivelugu.com

About Us | Disclaimer | Contact Us | Feedback | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap