కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్దవ్ ఠాక్రే ఫైర్ అయ్యారు. వీర సావర్కర్ను అవమానపరిస్తే తాము భరించలేమని ఠాక్రే పేర్కొన్నారు. సావర్కర్ విషయంలో పోరాటానికి కూడా తాము వెనుకాడబోమని ఆయన హెచ్చరించారు.
సావర్కర్ను కించపరిచేలా మాట్లాడటం సరికాదని రాహుల్ గాంధీకి ఆయన సూచించారు. సూరత్ కోర్టు తీర్పు నేపథ్యంలో ఇటీవల రాహుల్ గాంధీ ఎంపీ పదవిని లోక్ సభ సచివాలయం రద్దు చేసింది. ఈ విషయంపై ఆయన మీడియాతో మాట్లాడుతూ….
తన పేరు సావర్కర్ కాదన్నారు. తన పేరు గాంధీ..! అని తమది క్షమాపణలు చెప్పే కుటుంబం కాదని ఆయన అన్నారు. ఈ వ్యాఖ్యలపై శివసేన నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హిందుత్వ సిద్ధాంతాల విషయంలో సావర్కర్ తకు స్ఫూర్తి అని ఠాక్రే అన్నారు.
తాము సావర్క్ర్ను ఆరాధ్య దైవంగా భావిస్తున్నామని చెప్పారు. సావర్కర్ని అవమానించకండని రాహుల్ కు సూచిచారు. 14 ఏళ్ల పాటు అండమాన్ సెల్యులర్ జైల్లో ఊహకందని చిత్రహింసలను సావర్కర్ అనుభవించాడన్నారు. అది త్యాగానికి ప్రతిరూపమన్నారు.
అలాంటి వ్యక్తి గురించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తే విపక్ష కూటమిలో చీలికలు వచ్చే ప్రమాదం ఉందన్నారు. తాను రాహుల్ గాంధీకి ఒకటి చెప్పాలనుకుంటున్నానన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసమే తాము కాంగ్రెస్, ఎన్సీపీల కూటమితో జత కట్టామని వివరించారు.
ఐక్యంగా పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. చీలికలు సృష్టించే ఎటువంటి ప్రకటనలు, వ్యాఖ్యలు చేయొద్దని రాహుల్ కు సూచించారు. వారు (బీజేపీ) ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టేందుకు ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి విషయాల గురించి ఆలోచించి సమయాన్ని వృధా చేసుకోవద్దన్నారు.