ఆస్ట్రేలియాతో తొలి వన్డేలో టీమిండియా విజయం సాధించిన విషయం తెలిసిందే.. విశాఖపట్నం వేదికగా రెండో వన్డేలో గెలిచి సిరీస్ను సొంతం చేసుకోవాలని చూస్తోంది.అయితే ఈ మ్యాచ్కు వర్షం అంతరాయం కలిగించే అవకాశం ఉంది. మార్చి 18 నుంచి 20 వరకు మూడు రోజుల పాటు విశాఖలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
తెలుగు రాష్ట్రాల్లో శనివారం, ఆదివారం వర్షాలు పడతాయని వాతావరణ శాఖ ఇప్పటికే వెల్లడించింది. ఉపరితల ద్రోణి ప్రభావంతో ఏపీలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రేపు విశాఖలో డే/నైట్ మ్యాచ్ జరగనుండగా, టికెట్లన్నీ అమ్ముడయ్యాయి. ఏపీ కోస్తా జిల్లాల్లో వర్షాలు పడుతుండగా, రేపు విశాఖలోనూ వరుణుడి ప్రభావం కనిపించే అవకాశాలున్నట్టు వాతావరణ నిపుణులు చెబుతున్నారు.
దాంతో ఈ మ్యాచ్ జరగడంపై సందిగ్ధత నెలకొంది. శుక్రవారం ముంబయిలో జరిగిన తొలి వన్డేలో ఆసీస్ పై టీమిండియా 5 వికెట్ల తేడాతో నెగ్గడం తెలిసిందే. దాంతో, మూడు వన్డేల సిరీస్ లో టీమిండియా 1-0తో ముందంజ వేసింది.
వర్షం పడితే ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కూడా ఓ ప్రకటనలో వెల్లడించింది. కాగా ఈ మ్యాచ్ మధ్యాహ్నం 1:30 గంటలకు ప్రారంభం కానుంది.