దర్శక ధీరుడు రాజమౌళి పేరు ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా మారు మోగిపోతుంది. ఆర్ఆర్ఆర్ సినిమా ఆస్కార్ అవార్డు అందుకోవడంతో తెలుగు చిత్ర పరిశ్రమకే గర్వకారణంగా నిలిచారు. ఇలా ఆస్కార్ రావడానికి కీరవాణి, రాజమౌళి పాత్ర ఎంతో ఉందని చెప్పాలి. అంతర్జాతీయ వేదిక అయినటువంటి ఆస్కార్ స్టేజీ మీద సందడి చేసిన కీరవాణి, దర్శకుడు రాజమౌళి ఒకనాకొ సందర్భంలో చాలా పేదరికం అనుభవించారని చాలా మందికి తెలియని విషయం.
కొద్ది రోజుల క్రితం కీరవాణి తండ్రి శివశక్తి దత్త ఒక మీడియా ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ క్రమంలో ఆయన ఒకప్పుడు తమ కుటుంబం అనుభవించిన పేదరికం గురించి తెలియజేశారు. మొత్తం తాము నలుగురు అన్నదమ్ములమని తెలిపారు. తుంగభద్ర తీరానికి వలస వెళ్ళాం. 16 సంవత్సరాలు ఆ ప్రాంతంలో ఉన్నాము.
అక్కడ నేను 300 ఎకరాల పొలం కొన్నాము.అయితే చిన్నప్పటినుంచి సినిమాలపై పిచ్చి ఉండడంతో సినిమాల కోసమే ఆస్తులు మొత్తం పోగొట్టుకున్నామని ఈయన తెలియజేశారు.ఇలా ఆస్తులు పోవడంతో రోజు గడవడం కూడా కష్టంగా మారి కటిక పేదరికం అనుభవించామని తెలిపారు. కీరవాణి మ్యూజిక్ డైరెక్టర్ చక్రవర్తి దగ్గర పనిచేసేవాడు. కీరవాణి సంపాదనే మమ్మల్ని బ్రతికించింది.
కీరవాణి ప్రతిభ కలవాడు చిన్నప్పటినుంచి తనకు సంగీతంపై ఆసక్తి ఉండడంతో తనకి సంగీతం నేర్పించానని ఆయన తెలియజేశారు.నేను తమ్ముడు విజయేంద్ర ప్రసాద్ కలిసి కథారచయితలుగా పని చేశాము. జానకిరాముడు, కొండవీటి సింహం వంటి హిట్ చిత్రాలకు కథలు అందించామని చెప్పుకొచ్చారు.
ఇలా ఒకప్పుడు కటిక పేదరికం అనుభవించినటువంటి రాజమౌళి కీరవాణి నేడు ఆస్కార్ స్థాయి వరకు వెళ్లడం నిజంగా గర్వించదగ్గ విషయం అంటూ ఈ సందర్భంగా కీరవాణి తండ్రి తెలియజేశారు.ఇలా ఈయన చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.