ఉపరాష్ట్రపతి పదవిపై సినీనటుడు రజనీకాంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వెంకయ్యనాయుడికి ఉపరాష్ట్రపతి పదవి ఇవ్వడం తనకు నచ్చలేదని వెల్లడించారు. ఆయన మరికొన్ని రోజులు కేంద్రమంత్రిగా ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు. ఒక గొప్ప నాయకుడిని రాజకీయాల నుంచి దూరం చేశారని తెలిపారు.
శనివారం రాత్రి చెన్నైలోని సేఫియర్స్ హెల్త్ ఫౌండేషన్ రజతోత్సవాల్లో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. మార్చి 11 న రాత్రి చెన్నైలోని మ్యూజిక్ అకాడమీలో జరిగిన సేఫియన్స్ హెల్త్ ఫౌండేసన్ రజతోత్సవాల్లో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, రజనీకాంత్ పాల్గొన్నారు.
ఆర్ఎస్ఎస్ నుంచి కేంద్రమంత్రిగా, ఉపరాష్ట్రపతి అయిన వెంకయ్య నాయుడు త్వరగా రాజకీయాల నుంచి దూరమవ్వడం నచ్చలేదన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడిన వెంకయ్య నాయుడు..రజనీకాంత్ రాజకీయాల్లోకి రావొద్దనే చెప్పానన్నారు.
ఆరోగ్యం బాగుండాలంటే రాజకీయాల్లోకి రావొద్దని సలహా ఇచ్చానన్నారు. ప్రజలకు సేవ చేయాలంటే రాజకీయాలు ఒకటే మార్గం కాదని.. దానికి చాలా మార్గాలున్నాయని సూచించారు..