తెలుగు రాష్ట్రాల్లో అతి పెద్ద అంతర్జాతీయ విమానాశ్రయం రాజీవ్గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం. హైదరాబాద్ నగరానికి 24 కిలోమీటర్ల దూరంలో శంషాబాద్ ప్రాంతంలో నిర్మించిన ఈ విమానాశ్రయాన్ని 2008 మార్చిలో ప్రారంభమైంది. 5 వేల 495 ఎకరాల విస్తీర్ణంలో ఎయిర్పోర్ట్ భవనం నిర్మితమైంది. వైశాల్యం పరంగా దేశంలోనే అతిపెద్దదైన ఈ విమానాశ్రయాన్ని జీఎంఆర్ సంస్థ నిర్మించింది. అయితే, ఇప్పుడీ ఈ విమానాశ్రయం మరో 30 ఏళ్లు జీఎంఆర్ గ్రూప్ నిర్వహణలోనే ఉండనుంది.
ప్రపంచంలోని టాప్ 10 విమానాశ్రయాల్లో స్థానం పొందిన రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని.. పీపీపీ పద్ధతిలో 2004 నిర్మాణం ప్రారంభించారు. 5 వేల 495 ఎకరాల విస్తీర్ణంలో ఎయిర్పోర్ట్ భవనం నిర్మితమైంది. వైశాల్యం పరంగా దేశంలోనే అతిపెద్దదైన ఈ విమానాశ్రయాన్ని జీఎంఆర్ సంస్థ నిర్మించింది. అప్పటి ఒప్పందంలో భాగంగా నిర్మాణ సంస్థ జీఎంఆర్కు 2038 వరకూ అంటే మరో 16 ఏళ్ల వరకూ జీఎంఆర్ సంస్థకే ఎయిర్పోర్ట్ నిర్వహణ బాధ్యతలున్నాయి.
ఈ నేపథ్యంలో నిర్వాహణ హక్కుల గడువును మరో 30 ఏళ్ల పాటు పొడిగించాలని జీఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్(జీహెచ్ఐఏఎల్) దరఖాస్తు చేసుకుంది. దీనికి కేంద్ర ప్రభుత్వ పౌరవిమానయాన శాఖ తన ఆమోదాన్ని తెలియజేస్తూ లేఖ పంపినట్లు జీహెచ్ఐఏఎల్ ప్రకటించింది.
దీంతో 2068 వరకూ ఈ విమానాశ్రయం జీహెచ్ఐఏఎల్ నిర్వహణలో ఉండనుంది. ప్రభుత్వంతో 2004, డిసెంబరు 30న కుదిరిన ఒప్పంద పత్రం(కన్సెషన్ అగ్రిమెంట్) ప్రకారం ఈ పొడిగింపు లభించినట్లు వివరించింది సంస్థ. తొలుత ఏటా 1.20 కోట్ల మంది ప్రయాణికుల రాకపోకలకు అనుగుణంగా ఈ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని సిద్ధం చేశారు. ప్రస్తుతం కొనసాగుతున్న విస్తరణ పూర్తయితే ఈ విమానాశ్రయం నుంచి ఏటా 3 కోట్ల మందికి పైగా ప్రయాణికులు వచ్చివెళ్లే అవకాశం ఉంది. అంతేగాక ఏటా 1.50 లక్షల టన్నుల సరకు రవాణాను నిర్వహించగల సామర్థ్యం రాజీవ్గాంధీ విమానాశ్రయానికి ఉంది.