• Skip to main content
  • Skip to secondary menu
  • Skip to primary sidebar
tolivelugu-logo-removebg-preview

Tolivelugu తొలివెలుగు

Tolivelugu News provide Latest Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, TG and AP News Headlines Live (తెలుగు తాజా వార్తలు), Telugu News Online (తెలుగు తాజా వార్తలు)

tolivelugu facebook tolivelugu twitter tolivelugu instagram tolivelugu tv subscribe nowtolivelugu-app
  • తెలుగు హోమ్
  • వీడియోస్
  • రాజకీయాలు
  • వేడి వేడిగా
  • ఫిలిం నగర్
  • E-Daily
  • చెప్పండి బాస్
  • ENGLISH
Tolivelugu Latest Telugu Breaking News » National » భారత ఎన్నికల కమిషన్‌గా రాజీవ్ కుమార్ నియమాకం

భారత ఎన్నికల కమిషన్‌గా రాజీవ్ కుమార్ నియమాకం

Last Updated: May 12, 2022 at 7:25 pm

భారత ఎన్నికల కమిషన్‌ 25వ ప్రధాన కమిషనర్‌‌గా రాజీవ్‌ కుమార్‌ నియమితులయ్యారు. ప్రస్తుతం ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా ఉన్న సుశీల్ చంద్ర పదవీకాలం మే 14తో ముగియనుంది. దీంతో మే 15న రాజీవ్ కుమార్ ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా భాద్యతలు స్వీకరించనున్నారు. కొత్త సీఈసీగా రాజీవ్ కుమార్ నియామక ఉత్తర్వులను కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజు ట్విట్టర్ వేదికగానూ వెల్లడించారు.

‘రాజ్యాంగంలోని ఆర్టికల్ 324లోని క్లాజ్(2) ప్రకారం.. మే 15, 2022 నుంచి ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా రాజీవ్ కుమార్‌ను నియమించడం పట్ల రాష్ట్రపతి సంతోషిస్తున్నారు. రాజీవ్ కుమార్‌కు నా శుభాకాంక్షలు’ అని కిరన్ రిజిజు పేర్కొన్నారు. 2020 సెప్టెంబ‌ర్ 1న కేంద్ర ఎన్నిక‌ల సంఘం క‌మిష‌న‌ర్‌గా బాధ్య‌త‌లు చేపట్టిన రాజీవ్ కుమార్ తాజాగా సీఈసీగా ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్ట‌నున్నారు.

1984 బ్యాచ్ చెందిన ఐఏఎస్‌ అధికారి అయిన రాజీవ్ కుమార్.. బీహార్‌, ఝార్ఖండ్ కేడ‌ర్ అధికారిగా త‌న వృత్తి జీవితాన్ని ప్రారంభించారు. కేంద్ర స‌ర్వీసుల‌కు వ‌చ్చిన త‌ర్వాత ఆర్బీఐ, సెబీ, నాబార్డ్‌ల‌లో డైరెక్టర్‌గా వ్య‌వ‌హ‌రించారు. ఆర్థిక రంగానికి చెందిన ప‌లు ఇత‌ర సంస్థ‌ల‌కు కూడా రాజీవ్ కుమార్ సేవ‌లందించారు. ఎన్నిక‌ల క‌మిష‌నర్‌గా బాధ్య‌త‌లు చేపట్టక ముందు ప‌బ్లిక్ ఎంట‌ర్‌ప్రైజెస్ సెలెక్ష‌న్ బోర్డు చైర్మ‌న్‌గా ఆయ‌న వ్యవ‌హ‌రించారు.

పబ్లిక్‌ పాలసీ, అడ్మినిస్ట్రేషన్ విభాగాల్లో రాజీవ్ కుమార్‌కు 30 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఆయన మాస్టర్స్‌ ఇన్‌ పబ్లిక్‌ పాలసీ అండ్‌ సస్టెయినబిలిటీతో పాటు బీఎస్సీ, ఎల్‌ఎల్‌బీ డిగ్రీల్లో పట్టభద్రులు. ఆయన 2020 ఫిబ్రవరిలో ఐఏఎస్‌గా పదవి వీరమణ పొందారు.

In pursuance of clause (2) of article 324 of the Constitution, the President is pleased to appoint Shri Rajiv Kumar as the Chief Election Commissioner with effect from the 15th May, 2022.
My best wishes to Shri Rajiv Kumar pic.twitter.com/QnFLRLiVPm

— Kiren Rijiju (@KirenRijiju) May 12, 2022

Primary Sidebar

తాజా వార్తలు

టోల్ ట్యాక్స్ పెంపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి!

ఘనంగా సాగుతున్న శోభాయాత్ర

రాజాసింగ్ కు మరో షాక్

మోడీకి వ్యతిరేకంగా ఆప్ ‘పాన్ ఇండియా’ పోస్టర్ల ప్రచారం..!

దహీ నోటిఫికేషన్ … స్టాలిన్‌ను సమర్థించిన బీజేపీ చీఫ్..!

నేషనల్ హై వే పై క్షణాల్లో బస్సు, స్కూటీ దగ్ధం.. ఒకరి మృతి!

నాటునాటు స్టెప్పులేసిన జీ20 ప్రతినిధులు!

వరంగల్ సీపీకి క్షీరాభిషేకం

పండగ పూట విషాదం..బావిలో పడిన భక్తులు!

18 ఏళ్లకే రాజకీయాల్లోకి..23 ఏళ్లకే మేయర్‌ గా!

చనిపోయిన వ్యక్తికి లోన్.. డబ్బులివ్వకుండానే కట్టాలంటూ నోటీసులు

మళ్లీ యాదాద్రిలో కలకలం రేపిన డ్రోన్!

ఫిల్మ్ నగర్

g20 delegates in chandigharh dance to oscar winning naatu naatu

నాటునాటు స్టెప్పులేసిన జీ20 ప్రతినిధులు!

అనుష్క బొద్దుగా మారడానికి కారణం అదేనా?

అనుష్క బొద్దుగా మారడానికి కారణం అదేనా?

senior actor sarat babu hospitalised at chennai

అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన శరత్ బాబు!

ps2 trailer out

పీఎస్‌ 2 ట్రైలర్‌ వచ్చేసింది!

prabhas latest movie adipurush special poster released on ram navami

మంత్రం కన్నా గొప్పది నీ నామం..అంటూ!

మేటరున్న టీజర్ గా ‘మీటర్’ … హిట్ కొట్టనున్న కిరణ్ అబ్బ’వరం’..!

మేటరున్న టీజర్ గా ‘మీటర్’ … హిట్ కొట్టనున్న కిరణ్ అబ్బ’వరం’..!

డిసెంబర్ 22 న ‘సైంధవ్’గా ఫుల్ యాక్షన్ మీల్స్ పెట్టనున్న వెంకీమామ..!

డిసెంబర్ 22 న ‘సైంధవ్’గా ఫుల్ యాక్షన్ మీల్స్ పెట్టనున్న వెంకీమామ..!

బిజినెస్ వుమెన్ గా మారిన సమంత…!?

బిజినెస్ వుమెన్ గా మారిన సమంత…!?

Download Tolivelugu App Now

tolivelugu app download

Copyright © 2023 · Tolivelugu.com

About Us | Disclaimer | Contact Us | Feedback | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap