భారత ఎన్నికల కమిషన్ 25వ ప్రధాన కమిషనర్గా రాజీవ్ కుమార్ నియమితులయ్యారు. ప్రస్తుతం ప్రధాన ఎన్నికల కమిషనర్గా ఉన్న సుశీల్ చంద్ర పదవీకాలం మే 14తో ముగియనుంది. దీంతో మే 15న రాజీవ్ కుమార్ ప్రధాన ఎన్నికల కమిషనర్గా భాద్యతలు స్వీకరించనున్నారు. కొత్త సీఈసీగా రాజీవ్ కుమార్ నియామక ఉత్తర్వులను కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజు ట్విట్టర్ వేదికగానూ వెల్లడించారు.
‘రాజ్యాంగంలోని ఆర్టికల్ 324లోని క్లాజ్(2) ప్రకారం.. మే 15, 2022 నుంచి ప్రధాన ఎన్నికల కమిషనర్గా రాజీవ్ కుమార్ను నియమించడం పట్ల రాష్ట్రపతి సంతోషిస్తున్నారు. రాజీవ్ కుమార్కు నా శుభాకాంక్షలు’ అని కిరన్ రిజిజు పేర్కొన్నారు. 2020 సెప్టెంబర్ 1న కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్గా బాధ్యతలు చేపట్టిన రాజీవ్ కుమార్ తాజాగా సీఈసీగా పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు.
1984 బ్యాచ్ చెందిన ఐఏఎస్ అధికారి అయిన రాజీవ్ కుమార్.. బీహార్, ఝార్ఖండ్ కేడర్ అధికారిగా తన వృత్తి జీవితాన్ని ప్రారంభించారు. కేంద్ర సర్వీసులకు వచ్చిన తర్వాత ఆర్బీఐ, సెబీ, నాబార్డ్లలో డైరెక్టర్గా వ్యవహరించారు. ఆర్థిక రంగానికి చెందిన పలు ఇతర సంస్థలకు కూడా రాజీవ్ కుమార్ సేవలందించారు. ఎన్నికల కమిషనర్గా బాధ్యతలు చేపట్టక ముందు పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ సెలెక్షన్ బోర్డు చైర్మన్గా ఆయన వ్యవహరించారు.
పబ్లిక్ పాలసీ, అడ్మినిస్ట్రేషన్ విభాగాల్లో రాజీవ్ కుమార్కు 30 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఆయన మాస్టర్స్ ఇన్ పబ్లిక్ పాలసీ అండ్ సస్టెయినబిలిటీతో పాటు బీఎస్సీ, ఎల్ఎల్బీ డిగ్రీల్లో పట్టభద్రులు. ఆయన 2020 ఫిబ్రవరిలో ఐఏఎస్గా పదవి వీరమణ పొందారు.
In pursuance of clause (2) of article 324 of the Constitution, the President is pleased to appoint Shri Rajiv Kumar as the Chief Election Commissioner with effect from the 15th May, 2022.
My best wishes to Shri Rajiv Kumar pic.twitter.com/QnFLRLiVPm— Kiren Rijiju (@KirenRijiju) May 12, 2022