అతను మృగవేషంలో ఉన్న మానవ మృగం.పోలీసులే అతనికి ఎర. ఖాఖీల మీదే అతని కసి. వాళ్ళే అతని జంతువులు. రక్షక భటులే అతనికి భక్షణ. తమ డిపార్టు మెంటును టార్గెట్ చేసిన ఆ మానవ మృగం ఎవరు? పోలీసులనే ఎందుకు ఎంచుకున్నాడు. వారినే ఎందుకు వేటాడుతున్నాడు..ఇంతకీ అతన్ని పోలీసులు పట్టుకున్నారా లేదా అనే విషయం తెలియాలంటే ‘పులి మేక’ చూడాల్సిందే. జీ 5 ఓటీటీ లైబ్రరీలో ఫిబ్రవరి 24న బెస్ట్ ఒరిజినల్గా జాయిన్ కావటానికి ‘పులి మేక’ సిద్ధమవుతుంది.
ఈ ఒరిజినల్ కోసం జీ 5 కోనఫిల్మ్ కార్పొరేషన్తో జాయిన్ అయ్యింది. లావణ్య త్రిపాఠి, ఆది సాయి కుమార్, సిరి హన్మంత్, సుమన్, రాజా ప్రధాన పాత్రలు పోషించిన ‘పులి మేక’ టీజర్ ను శుక్రవారం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రిలీజ్ చేసి టీమ్కి అభినందనలు తెలిపారు.
‘పులి మేక’ టీజర్ను గమనిస్తే .. పోలీసులను మృగంలాంటి వేషధారణతో ఉన్న వ్యక్తి వరుసగా చంపేస్తుంటాడు. అసలు ఈ హత్యలను ఎవరు చేస్తున్నారనేది తెలియక డిపార్ట్మెంట్ తలపట్టుకుంది.
వెంటనే కేసుని సాల్వ్ చేయటానికి, హంతకుడిని పట్టుకోవటానికి పోలీస్ డిపార్ట్మెంట్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ను ఏర్పాటు చేస్తుంది. దానికి హెడ్ కిరణ్ ప్రభ (లావణ్య త్రిపాఠి). అదే టీమ్లో ఫోరెన్సిక్ టీమ్ మెంబర్ ప్రభాకర్ శర్మ (ఆది సాయికుమార్) కనిపిస్తున్నారు.
కేసుని సాల్వ్ చేయటానికి పోలీసులు కష్టపడుతుంటే మరో వైపు మీడియా, పై అధికారుల నుంచి తెలియని ఒత్తిడి వారిపై ఉంటుంది. ఈ సన్నివేశాలను చాలా ఇంట్రెస్టింగ్ వేలో టీజర్గా కట్ చేశారు.