టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నిందితులుగా ఉన్న నంద కుమార్, రామచంద్ర భారతి లకు వైద్య పరీక్షలు నిర్వహించారు. షౌకత్ నగర్ పీహెచ్ సీలో వైద్యులు మెడికల్ టెస్టులు చేశారు. అనంతరం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లారు.
కాగా గురువారం ఉదయమే చంచల్ గూడ జైలు నుంచి రామచంద్ర భారతి, నందకుమార్ లు విడుదలైన సంగతి తెలిసిందే. వారిద్దరూ బయటికి రాగానే టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు.
రామచంద్ర భారతిపై ఫేక్ డ్రైవింగ్ లైసెన్స్, ఫేక్ ఆధార్ కార్డ్ కేసు నమోదవ్వగా.. నంద కుమార్ పై బంజారా హిల్స్ పీఎస్ లో చీటింగ్ కేసు ఫైల్ అయింది. ఈ కేసుల నేపథ్యంలో పోలీసులు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లారు.
జైలు నుంచి విడుదలైన వెంటనే రామచంద్ర భారతి, నందకుమార్ లను పోలీసులు అరెస్ట్ చేయడంపై నంద కుమార్ రియాక్ట్ అయ్యారు. తాను 45 రోజుల పాటు జైళ్లో ఉన్నానని, తనకు అసలు ఏం జరుగుతుందో తెలియడం లేదని నందకుమార్ తెలిపారు. ఈ కేసుల గురించి పూర్తిగా తెలుసుకున్నాకే మాట్లాడతానని స్పష్టం చేశారు.