కోటేరులాంటి ముక్కు, గుండ్రని ముఖం, గంభీరమైన రూపంతో తెలుగు ప్రేక్షకులను అలరించిన నటుడు రంగనాథ్. బుద్ధిమంతుడు సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయ్యారు.హీరోగా, విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా 300కు పైగా సినిమాలలో నటించి ప్రేక్షకులను అలరించారు.1974 సంవత్సరంలో చందన అనే సినిమాలో హీరోగా నటించిన ఆకట్టుకున్నారు.
కాగా ప్రముఖ దర్శకుడు బాపు తెరకెక్కించిన అందాల రాముడు సినిమాలో హీరోగా నటించి ప్రేక్షకులను అలరించారు. కుటుంబ కథా చిత్రాలు ఎక్కువగా చేసిన రంగనాథ్ ఇండస్ట్రీలో పోటీ కారణంగా ఇబ్బందులు ఎదుర్కొన్నాడు.
ఆ తర్వాత హీరో అవకాశాలు తగ్గుముఖం పట్టడంతో ఎలాంటి పాత్ర వచ్చినా చేస్తూ ముందుకు సాగారు. అలా గువ్వల జంట సినిమాతో రంగనాథ్ రీఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు సినిమాల్లో నటించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు.
ఎన్టీఆర్, ఏఎన్నార్, ఎస్వీ రంగారావు, కృష్ణ, కృష్ణంరాజు లాంటి స్టార్ హీరోలతో సినిమాలు చేసి వారితో మంచి అనుబంధాన్ని ఏర్పరచుకున్నారు. కేవలం సినిమాలు కాకుండా సీరియల్స్ లో కూడా నటించి రంగనాథ్ అభిమానులను సంపాదించుకున్నారు.
అదేవిధంగా నటనతో పాటు రచయితగా కూడా ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు. ఇక సినీ చరిత్రలో తనకంటూ చెరగని ముద్ర వేసుకున్న రంగనాథ్ కొన్ని కారణాల వల్ల ఆత్మహత్య చేసుకుని చనిపోయారు. కాగా ఆయన ఆత్మహత్య చేసుకున్న తీరు అందర్నీ బాధింపజేసింది.
అంతేకాకుండా ఆత్మహత్య చేసుకునే ముందు రంగనాథ్ తన ఇంట్లో గోడపై బొగ్గుతో మీనాక్షి అనే అమ్మాయికి ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని రాసి పెట్టారు. మీనాక్షి అనే అమ్మాయి రంగనాథ్ వద్ద పనిచేయగా, తనకోసం పనిచేసిన వ్యక్తి రుణం ఉంచుకోకూడదు అనే ఉద్దేశంతో రంగనాథ్ అలా రాసినట్టు తెలుస్తోంది.
Also Read: ఒకేఒక్కడు మూవీ మెగాస్టార్ ఎందుకు మిస్ చేసుకున్నాడబ్బా …!