క్రికెట్ ను వినోదామ్మకంగానే కాకుండా వ్యాపారాత్మకంగా మార్చింది IPL. . రిచెస్ట్ క్రికెట్ లీగ్ కూడా ఇదేనని చెప్పొచ్చు. టీ20లో కొత్త వరవడి సృష్టించింది. ఆటకి ఉన్న పరిధిని పెంచి ఆటగాళ్ళ మధ్య ఉన్న అడ్డు గోడల్ని కూల్చేసింది.దేశాల మధ్య ఉన్న హాద్దుల్ని సైతం బద్దలు చేసింది.
క్రికెట్ ప్రియులు ఎంతగానో ఎదురు చూస్తున్న సందర్భం ఇప్పుడు రానే వచ్చింది. ఈ ఏడాది మార్చి 31 నుంచి ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఘనంగా మొదలు కానుంది.
ఐపీఎల్ 2023 ప్రారంభ వేడుకల్లో నేషనల్ క్రష్ రష్మిక మంధాన, తమన్నా భాటియా సందడి చేయనున్నారని తెలిసింది. లైవ్ డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ చేయనున్నారని సమాచారం. కరోనా కారణంగా గత మూడేళ్లుగా ప్రారంభ వేడుకలు జరగలేదు.
దీంతో ఈ సారి వేడుకలను ఘనంగా నిర్వహించాలని బీసీసీఐ ప్లాన్ చేస్తోందట. అలా ఇందులో భాగంగానే.. గతంలోలా అందాల తారలను రంగంలోకి దింపనుందట. రష్మిక, తమన్నలతో పాటు మరికొంతమంది బాలీవుడ్ యాక్టర్స్ ని తీసుకురానుంది.
ఈ విషయాన్ని బీసీసీఐకి చెందిన ఓ అధికారి తెలిపారు. మూడేళ్ల తర్వాత హోమ్ అండ్ అవే ఫార్మాట్లో ఈ మెగాలీగ్ జరుగుతుండటం వల్ల.. అభిమానులు ఈ మెగా టోర్నీకోసం మరింత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.అందుకే ఇలా గ్రాండ్గా ప్లాన్ చేస్తుందట.
కాగా, ఐపీఎల్ 16వ తాజా ఎడిషన్ మార్చి 31న అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ప్రారంభంకానుంది. చెన్నై సూపర్ కింగ్స్- డిపెండింగ్ ఛాంపియన్స్ గుజరాత్ టైటాన్స్ మధ్య జరగబోయే మ్యాచ్తో ఈ సీజన్ అట్టహాసంగా మొదలుకానుంది.
ఈ మ్యాచ్ ప్రారంభయ్యే అరగంట ముందు ఓపెనింగ్ సెర్మనీ నిర్వహించనున్నారు. ప్రస్తుతం జరుగుతున్న మహిళల ఐపీఎల్ డబ్ల్యూపీఎల్లో కూడా ప్రారంభోత్సవ వేడుకలను గ్రాండ్ గా నిర్వహించింది బీసీసీఐ. అందులో కియారా అద్వాణీ, కృతిసనన్ స్టేజ్పై చిందులేస్తూ ఫ్యాన్స్ను ఉర్రూతలూగించారు.
ఇకపోతే ఈ ఐపీఎల్లో కొత్త రూల్స్ అమలులోకి రానున్నాయి. తాజా సీజన్లో ఇంపాక్ట్ ప్లేయర్, వైడ్.. నో బాల్కు రివ్యూ తీసుకునే అవకాశం.. వంటి కొత్త నిబంధనలతో పాటు టాస్ వేశాకే తుది జట్టును ప్రకటించేలా కొత్త నిర్ణయాన్ని తీసుకున్నారు. ఇక ఈ మెగాటోర్నీ ఫైనల్ మ్యాచ్ మే 28న జరగనుంది.
మొత్తంగా పది టీమ్స్ పాల్గొనే ఈ ఐపీఎల్ 2023 సీజన్లో 70 లీగ్ మ్యాచ్లు జరగనున్నాయి. ఏడేసి మ్యాచ్లను హౌం గ్రౌండ్లో, వెలుపల స్టేడియాల్లో ఆడాల్సి ఉంటుంది.
గ్రూప్-ఏలో ముంబయి ఇండియన్స్, కోల్కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్, దిల్లీ క్యాపిటల్స్, లఖ్నవూ సూపర్ జెయింట్స్ ఉండగా.. గ్రూప్-బీలో చెన్నై సూపర్ కింగ్స్, సన్ రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ ఉన్నాయి.
ఈ మ్యాచులన్నింటి కోసం 12 వేదికలను నిర్ణయించారు. అహ్మదాబాద్, మొహాలి, లఖ్నవూ, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, దిల్లీ, కోల్కతా, జయ్పుర్, ముంబయి, గువాహటి, ధర్మశాల వేదికలుగా ఈ మ్యాచ్లను నిర్వహించనున్నారు. రెండు మ్యాచ్లు ఉన్నప్పుడు.. మధ్యాహ్నం 3.30 గంటలకు ఒకటి.. రాత్రి 7.30 గంటలకు మరొకటి నిర్వహిస్తారు.