• Skip to main content
  • Skip to secondary menu
  • Skip to primary sidebar
Tolivelugu తొలివెలుగు – Latest Telugu Breaking News

Tolivelugu తొలివెలుగు - Latest Telugu Breaking News

Tolivelugu News provide Latest Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, TG and AP News Headlines Live (తెలుగు తాజా వార్తలు), Telugu News Online (తెలుగు తాజా వార్తలు)

tolivelugu facebook tolivelugu twitter tolivelugu instagram tolivelugu tv subscribe nowtolivelugu-app
  • తెలుగు హోమ్
  • వీడియోస్
  • రాజకీయాలు
  • వేడి వేడిగా
  • ఫిలిం నగర్
  • E-Daily
  • చెప్పండి బాస్
  • ENGLISH
Tolivelugu Latest Telugu Breaking News » devotional » పూరీ జగన్నాథుని ర‌థ‌యాత్ర‌.. క‌న్నుల పండుగ‌గా ఆలయం..!

పూరీ జగన్నాథుని ర‌థ‌యాత్ర‌.. క‌న్నుల పండుగ‌గా ఆలయం..!

Last Updated: July 1, 2022 at 11:00 am

పూరి జగన్నాధ రథయాత్ర శుక్ర‌వారం ఒడిశాలోని పూరీ క్షేత్రంలో ప్రారంభమైంది. దీంతో పూరీ నగరం భక్తులతో కిక్కిరిసిపోయింది. గత రెండేళ్లుగా కరోనా కారణంగా పూరీ జగన్నాధ రథయాత్ర జరగక‌పోవ‌డంతో.. ఈసారి యాత్రలో పాల్గొనేందుకు భారీగా త‌ర‌లివ‌చ్చారు భక్తులు. ఈ యాత్ర‌ను తిల‌కించేందుకు రెండెళ్ల త‌ర్వాత‌ అవకాశం కల్పించడంతో గురువారం నుంచే భక్త జనసంద్రమైంది పూరీ నగరం.

ఆనవాయితీ ప్రకారం జగన్నాథుడి సోదరుడు బలభద్రుడు, సోదరి సుభద్రతో కలిసి గుండిచా మందిరానికి రథాల్లో చేరుకుంటారు. ఊరేగింపునకు జగన్నాథుడి రథం నందిఘోష్, బలభద్రుడి రథం తాళధ్వజ, సుభద్ర ర‌థం దర్పదళన్ లు సిద్ధమయ్యాయి. ఈ యాత్ర‌కు దేశ న‌లుమూల‌ల నుండి 15 లక్షల మంది భక్తులు హాజ‌రు కానున్న‌ట్టు అధికారులు అంచనా వేస్తున్నారు.

అయితే.. రథయాత్రలో తొక్కిసలాటకు తావు లేకుండా ఐదు అంచెల బందోబస్తు ఏర్పాటు చేసిన‌ట్టు డీజీపీ సునీల్‌ బన్సల్ వెల్ల‌డించారు. శుక్రవారం ఈ ప్రాంతాన్నంతా ‘నో ఫ్లయింగ్‌ జోన్‌’ చేయాలని విమానాశ్రయ యంత్రాంగాన్ని కోరామని తెలిపారు డీజీపీ.

పూరీ జగన్నాథ్ రథ యాత్ర సందర్భంగా కళాఖండాన్ని తీర్చిదిద్దారు సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకాన్ని ఆపేద్దాం అని సందేశం ఇచ్చేలా సైకత శిల్పాన్ని తీర్చిదిద్దారు. ఇదిలా ఉంటే.. గుజరాత్ అహ్మదాబాద్​ లోని జగన్నాథ్​ మందిరంలోనిర్వ‌హించిన‌ మంగళహారతి కార్యక్రమంలో కేంద్ర హోం మంత్రి అమిత్​ షా పాల్గొన్నారు.

రథయాత్ర సందర్భంగా దేశ ప్రజలకు రాష్ట్రపతి రామ్​నాథ్ కోవింద్ శుభాకాంక్షలు తెలిపారు. జగన్నాథుని ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆయ‌న‌ ట్వీట్ చేశారు. మరోవైపు.. జగన్నాథుని ఆశీస్సులతో దేశ ప్ర‌జ‌లంతా ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ ట్వీట్ చేశారు. రెండేళ్ల త‌ర్వాత జ‌రిగే ఈ ర‌థ‌యాత్ర క‌న్నుల పండుగ‌గా ఉండ‌బోతోంద‌న్నారు మోడీ.

Primary Sidebar

తాజా వార్తలు

పురిటి నొప్పులకు మామూలు నొప్పులకు తేడా ఏంటీ…?

చీము పడితే అన్నం అసలు తినవద్దు…!

కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఏం చేయబోతున్నాడో తెలుసా..?

కాంగ్రెస్ పాదయాత్ర..రేవంత్ లేకుండానే!

అనుమ‌తిని ఇచ్చేదే లే!!

వారిని ఉత్స‌వ విగ్ర‌హాలు చేసిన కేసీఆర్‌

కేసీఆర్ హ‌యాంలో రాష్ట్రం వెన‌క‌బ‌డింది

ఆయ‌న సంక్షేమాన్ని ప‌ట్టించుకోవ‌డం లేదు: కేటీఆర్‌

ఎందుకు రాద్ధాంతం చేస్తున్నారు: శ్రీ‌నివాస్ గౌడ్‌

రే చీకటి అంటే ఏంటీ…? రాకుండా ఉండాలంటే ఏం తినాలి…?

తల పాగా ఉండే సిక్కులకు హెల్మెట్ అవసరం లేదా…?

అద్భుత‌మైన కార్య‌క్ర‌మం!!

ఫిల్మ్ నగర్

బీజేపీలోకి సినీ న‌టుడు సంజ‌య్ రాయిచుర‌!!

బీజేపీలోకి సినీ న‌టుడు సంజ‌య్ రాయిచుర‌!!

ప‌వ‌ర్ స్టార్ జ‌ల్సా రీ రిలీజ్‌!!

ప‌వ‌ర్ స్టార్ జ‌ల్సా రీ రిలీజ్‌!!

ఆమె ప‌క్క‌న ఉంటే ఎంత దూరం అయిన వెళ్లొచ్చు!!

ఆమె ప‌క్క‌న ఉంటే ఎంత దూరం అయిన వెళ్లొచ్చు!!

రెండో రోజే 1300 షోలు క్యాన్సిల్‌!!

రెండో రోజే 1300 షోలు క్యాన్సిల్‌!!

అల్లు అర్జున్ స్టెప్ వెనుక రహస్యం చెప్పిన అమితాబ్

అల్లు అర్జున్ స్టెప్ వెనుక రహస్యం చెప్పిన అమితాబ్

హతవిధీ.. మరోసారి చిరంజీవిపై ట్రోలింగ్

హతవిధీ.. మరోసారి చిరంజీవిపై ట్రోలింగ్

బాబోయ్ బాలీవుడ్.. హిందీ చిత్రసీమకు ఏమైంది?

బాబోయ్ బాలీవుడ్.. హిందీ చిత్రసీమకు ఏమైంది?

బ్లాక్ బస్టర్ బింబిసార.. మొదటి వారం వసూళ్లు ఇవే

బ్లాక్ బస్టర్ బింబిసార.. మొదటి వారం వసూళ్లు ఇవే

Download Tolivelugu App Now

tolivelugu app download

Copyright © 2022 · Tolivelugu.com

About Us | Disclaimer | Contact Us | Feedback | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap

ToliVelugu News provide Latest Telugu Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, Telangana and AP News Headlines Live, Latest Telugu News Online (తెలుగు తాజా వార్తలు)