• Skip to main content
  • Skip to secondary menu
  • Skip to primary sidebar
Tolivelugu తొలివెలుగు – Latest Telugu Breaking News

Tolivelugu తొలివెలుగు - Latest Telugu Breaking News

Tolivelugu News provide Latest Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, TG and AP News Headlines Live (తెలుగు తాజా వార్తలు), Telugu News Online (తెలుగు తాజా వార్తలు)

tolivelugu facebook tolivelugu twitter tolivelugu instagram tolivelugu tv subscribe nowtolivelugu-app
  • తెలుగు హోమ్
  • వీడియోస్
  • రాజకీయాలు
  • వేడి వేడిగా
  • ఫిలిం నగర్
  • E-Daily
  • చెప్పండి బాస్
  • ENGLISH
Tolivelugu Latest Telugu Breaking News » Business » వరుసగా 11వ సారి కీలక వడ్డీ రేట్లు యథాతథం

వరుసగా 11వ సారి కీలక వడ్డీ రేట్లు యథాతథం

Last Updated: April 8, 2022 at 12:30 pm

కీలక వడ్డీ రేట్లకు సంబంధించి ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. 11వ సారి వరుసగా వడ్డీ రేట్లు యథాతథంగా ఉంచుతున్నట్లు ప్రకటన చేసింది. ఇప్పటికే ద్వైమాసిక ద్రవ్య పరపతి విధానంలోనూ ఆర్‌బీఐ కీలకమైన రెపో, రివర్స్‌ రెపో రేట్లు యథాతథంగా కొనసాగిస్తుందని ఆర్థిక నిపుణుల అంచనా వేశారు. వారి అంచనాలను ఆర్బీఐ మరోసారి నిజం చేస్తూ నిర్ణయం తీసుకుంది.

ఈ మేరకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022-23) నిర్వహించిన తొలి మానిటరీ పాలసీ కమిటీ సమావేశంలో తీసుకున్న కీలక నిర్ణయాలను ఆర్​బీఐ గవర్నర్​ శక్తికాంత దాస్ వివరించారు​. ఈ సారి కూడా రెపో రేటులో ఎలాంటి మార్పు లేదని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం రెపో రోటు 4 శాతం వద్ద కొనసాగుతోంది. రివర్స్ రెపో రేటును కూడా 3.35 శాతం వద్ద స్థిరంగా ఉంచినట్లు వెల్లడించారు శక్తికాంతదాస్​. అయితే, దేశీయంగా ద్రవ్యోల్బణం పైపైకి ఎగబాకుతున్నా.. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, ముడి చమురు ధరల పెరుగుదల వంటి అంతర్జాతీయ పరిస్థితుల మధ్య ఈసారి కూడా కీలక రేట్లలో ఎలాంటి మార్పు చేయలేదని చెప్పారు. ఇక మార్జినల్‌ స్టాండింగ్‌ ఫెసిలిటీ రేటు 4.25 శాతంగానే ఉండనున్నట్లు చెప్పారు.

ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ నేతృత్వంలోని ద్రవ్యపరపతి విధాన కమిటీ(ఎంపీసీ) యథాతథ స్థితిని కొనసాగించడం ఇది వరుసగా 11వ సారి. వడ్డీ రేటును చారిత్రాత్మక కనిష్ట స్థాయికి తగ్గించడం ద్వారా డిమాండ్‌ను పెంచడానికి ఆర్‌బీఐ తన పాలసీ రెపో రేటు లేదా స్వల్పకాలిక రుణ రేటును మే 22, 2020న చివరిసారిగా సవరించింది. ఫలితంగా రెపో రేటు చరిత్రలో కనిష్ఠమైన 4 శాతానికి దిగొచ్చింది. ఈసారి కూడా అదే రేటు కొనసాగిస్తూ.. ద్రవ్యోల్బణం పెరుగుదల దృష్ట్యా ‘అకామడేటివ్ స్టాన్స్​’ను ఆర్​బీఐ మార్చుకోవచ్చని నిపుణులు అంచనా వేశారు. అందుకు తగినట్లే శక్తికాంత దాస్ నేతృత్వంలోని ద్రవ్యపరపతి విధాన కమిటీ నిర్ణయం తీసుకుంది. ‘పునరుద్ధరణ-సుస్థిరాభివృద్ధి-ద్రవ్యోల్బణం కట్టడి’ వ్యూహంతో ముందుకు సాగనున్నట్లు స్పష్టం చేసింది.

ఆర్​బీఐ గవర్నర్ నేతృత్వంలోని నలుగురు సభ్యులతో కూడిన కమిటీనే.. మానిటరీ పాలసీ కమిటీగా పిలుస్తుంటారు. ప్రతి రెండు నెలలకు ఓ సారి ఈ కమిటీ సమావేశమై దేశ ఆర్థిక పరిస్థితులకు తగ్గట్లు కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. కీలక వడ్డీ రేట్ల మార్పు సహా వివిధ నిర్ణయాలు తీసుకుంటుంది. ఇందులో భాగంగా ఈ నెల 6న ప్రారంభమైన ఎంపీసీ సమావేశం ఏప్రిల్ 8 వరకు సాగింది. ఈ భేటీలో తీసుకున్న నిర్ణయాలను, ఆర్థిక వ్యవస్థపై అంచనాలను గవర్నర్​ శక్తికాంత దాస్​ మీడియాకు వెల్లడించారు.

భారత ఆర్థిక వ్యవస్థ సరికొత్త, పెను సవాలును ఎదుర్కొంటోందని రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు శక్తికాంత దాస్. ఒమిక్రాన్​ను సమర్థంగా ఎదుర్కోవడం వల్ల కలిగిన లాభాలను.. భౌగోళిక-రాజకీయ ఉద్రిక్తతల కారణంగా కోల్పోవాల్సి వచ్చిందని వివరించారు. అయితే, విదేశీ మారక నిల్వలు పుష్కలంగా ఉన్నాయని, ఆర్థిక వ్యవస్థను రక్షించేందుకు ఆర్​బీఐ సర్వసన్నద్ధమై ఉందని స్పష్టం చేశారు. దేశ ఆర్థిక వృద్ధిపై యుద్ధం ప్రతికూల ప్రభావం చూపుతుందని అంచనా వేశారు. 2022-23 ఆర్థిక సంవత్సరానికి వృద్ధి రేటు అంచనాను 7.2శాతానికి తగ్గిస్తున్నట్లు తెలిపారు. పెట్రో మంటతో ద్రవ్యోల్బణం మరింత(4.5శాతం నుంచి 5.7శాతానికి) పెరుగుతుందని, వంట నూనెల ధరలు కొంతకాలం అధికంగానే ఉంటాయని చెప్పారు శక్తికాంత దాస్. ఇక అన్ని పేమెంట్​ సిస్టమ్​ ఆపరేటర్​లకు త్వరలోనే కొత్త మార్గదర్శకాలు జారీ చేయనుంది ఆర్​బీఐ.

tolivelugu news - follow on google news
tolivelugu app download


Primary Sidebar

తాజా వార్తలు

ఆఫ్రికాతో ఆడే తుది జ‌ట్టు ఎంపిక‌..రాహుల్, కోహ్లీల‌కు విశ్రాంతి..!

డాక్ట‌ర్ల నిర్ల‌క్షం..ప్ర‌భుత్వ ఆసుప‌త్రిలో దారుణం..!

పంజాబ్ రైతులు రెండు గొప్ప పోరాటాలు చేశారు..!

నిఖత్ జరీన్‌కు రేవంత్‌రెడ్డి బహుమానం

శ్రీలంకలో ఆర్ధిక సంక్షోభం.. భారత్ సాయం..!

టీబీఏ అధ్యక్షుడిగా మరోసారి కేటీఆర్

నిజ‌మైన వృక్ష ప్రేమికుడు.. వ‌న‌జీవి రామ‌య్య..!

నేనింతే.. నా తీరింతే!

సోనుసూద్ ఫౌండేషన్ పేరిట మోసం

రేపు జపాన్ వెళ్లనున్న మోడీ

కేసీఆర్ సంచలనాలు ప్రగతి భవన్ వరకే.. కిషన్ రెడ్డి సెటైర్లు

ప్రధాని మోడీతో బ్యాడ్మింటన్ బృందం భేటీ

ఫిల్మ్ నగర్

ఎప్3 త‌ర్వాత మేజ‌ర్ సినిమానే.. అడ‌వి శేషు క్లారిటీ..!

ఎప్3 త‌ర్వాత మేజ‌ర్ సినిమానే.. అడ‌వి శేషు క్లారిటీ..!

కేన్స్ లో పూజా మెరుపులు!

కేన్స్ లో పూజా మెరుపులు!

కెమెరాకు చిక్కిన ఐశ్వ‌ర్య ర‌హ‌స్యం..!

కెమెరాకు చిక్కిన ఐశ్వ‌ర్య ర‌హ‌స్యం..!

బిగ్‏బాస్ చరిత్రలో.. తొలి మహిళా విజేత..!

బిగ్‏బాస్ చరిత్రలో.. తొలి మహిళా విజేత..!

స్టేజ్ పైనే ప్రియుడికి లిప్ లాక్.. షాక్ ఇచ్చిన హీరోయిన్..!

స్టేజ్ పైనే ప్రియుడికి లిప్ లాక్.. షాక్ ఇచ్చిన హీరోయిన్..!

మధురై దంపతులకు హీరో ధనుష్ లీగల్ నోటీసులు

మధురై దంపతులకు హీరో ధనుష్ లీగల్ నోటీసులు

ఎట్టకేలకు హరీశ్ శంకర్ సినిమాకు మోక్షం

ఎట్టకేలకు హరీశ్ శంకర్ సినిమాకు మోక్షం

Sarkaru Vaari Paata Movie OTT Release Date

ఆ డైలాగ్ పై నమ్మకం లేదన్న మహేష్

Download Tolivelugu App Now

tolivelugu app download

Copyright © 2022 · Tolivelugu.com

About Us | Disclaimer | Contact Us | Feedback | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap

ToliVelugu News provide Latest Telugu Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, Telangana and AP News Headlines Live, Latest Telugu News Online (తెలుగు తాజా వార్తలు)