డిజిటల్ పేమెంట్ యాప్స్ వచ్చాక ఒక్క క్లిక్ తో పేమెంట్స్ చేసేస్తున్నారు. వీటితో బ్యాంక్ వరకూ వెళ్లాల్సిన పని లేకుండా అవుతుంది. అలాగే ఎక్కడనా సులభంగా పేమెంట్స్ చేసేస్తున్నారు. అయితే అప్పుడప్పుడు నెట్ వర్క్ సరిగ్గా లేక, బ్యాంక్ సర్వర్లు పని చేయకనో పేమెంట్స్ సడెన్ గా నిలిచిపోతూంటాయి.
దీంతో డబ్బు పంపించిన వారికి వెళ్లక, మర్చంట్ కు తిరిగి రాక ఇబ్బందులు ఎదుర్కొంటున్న సంఘటనలు తరుచూ చూస్తూనే ఉన్నాం. పోగొట్టుకున్న డబ్బు గురించి ఎవరికి కంప్లైంట్ చేయాలో తెలియదు. అలాంటివాళ్ల పని సులువు అయ్యేలా, పోగొట్టుకున్న డబ్బు తిరిగి పొందేలా ఆర్బీఐ కొన్ని మార్గదర్శకాలు జారీ చేసింది.
అలా పంపించిన డబ్బులు వెళ్లక పోయినా.. రాకపోయినా.. ముందుగా మీరు పంపిన యూపీఐ యాప్ ల నుంచి కస్టమర్ సర్వీస్ కి ఫిర్యాదు చేయాలి. అక్కడ సహాయం అందకపోతే ఎన్పీసీఐ పోర్టల్లో ‘WHAT WE DO’ అనే ఆప్షన్ లోనైనా, లేదంటే బ్యాంక్ లో నైనా కంప్లైంట్ ఇవ్వాలి.
అక్కడ పని జరగకపోయినా bankingombudsman.rbi.org.inలో కూడా ఫిర్యాదు చేయొచ్చు. ఈ సర్వీస్ తో మీరు పోగొట్టుకున్న డబ్బుని తిరిగి పొందొచ్చు. అంతేకాదు హ్యాకర్ల ద్వారా పోగొట్టుకున్న డబ్బును కూడా ఫ్రీజ్ చేయవచ్చు. దానికి కూడా ఈ సేవల్ని వినియోగించుకోవచ్చని ఆర్బీఐ పేర్కొంది.