ఇక రుణ సంక్షోభంలో రిలయన్స్ క్యాపిటల్ బాగా కోరుకుపోయింది. ఇక దానిపై ఐబీసీ కింద దివాలా చర్యలు ప్రారంభించాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) దాఖలు చేసిన పిటిషన్ను సోమవారం ఎన్సీఎల్టీ (నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్), ముంబై బెంచ్ అనుమతించడం జరిగింది. కంపెనీపై కార్పొరేట్ దివాలా పరిష్కార ప్రక్రియను ప్రారంభించాలని గత వారం ఆర్బీఐ ఎన్సీఎల్టీ ముంబై బెంచ్లో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిని అడ్మిట్ చేస్తూ, ప్రదీప్ నరహరి, దేశ్ముఖ్, కపిల్ కుమార్ వాద్రాలతో కూడిన ఎన్సీఎల్టీ బెంచ్ సోమవారం సాయంత్రం రూలింగ్ ఇచ్చింది.
పాలనా సంబంధ అంశాల్లో డిఫాల్ట్ అయ్యిందని పేర్కొంటూ అనిల్ అంబానీ ప్రమోట్ చేస్తున్న రిలయన్స్ క్యాపిటల్ బోర్డ్ను నవంబర్ 29 వ తేదీన సెంట్రల్ బ్యాంక్ సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర మాజీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వై. నాగేశ్వరరావును కంపెనీ అడ్మినిస్ట్రేటర్గా కూడా నియమించడం జరిగింది.ఇక ఇదిలా ఉండగా, కంపెనీ ప్రమోటర్లు ఒక ప్రకటన చేయడం జరిగింది. అందుకే 227 సెక్షన్ కింద ఎన్సీఎల్టీలో ఆర్బీఐ దాఖలు చేసిన పిటిషన్ విచారణకు పూర్తిగా సహకరిస్తామని పేర్కొనడం జరిగింది. రుణదాతలు, కస్టమర్లు, ఉద్యోగులు ఇంకా షేర్హోల్డర్లతో సహా తన వాటాదారులందరి పూర్తి ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని, ఐబీసీ ప్రక్రియ ద్వారా వేగవంతమైన దివాలా పరిష్కార పక్రియకోసం కంపెనీ ఎదురుచూస్తున్నట్లు కూడా ప్రకటన తెలిపడం జరిగింది.
ఆర్థిక రంగ నియంత్రణ సంస్థలు ఇంకా ఫైనాన్షియల్ సర్వీస్ ప్రొవైడర్లు ఇంకా అలాగే సంబంధిత వర్గాలను సంప్రదించి ఒక కంపెనీని దివాలా– లిక్విడేషన్ ప్రొసీడింగ్ల కింద కేంద్రం నోటిఫై చేయడానికి దివాలా కోడ్ (ఐబీసీ)లోని సెక్షన్ 227 వీలుకల్పిస్తుంది. రిలయన్స్ క్యాపిటల్ రుణదాతలకు దాదాపు రూ.19,805 కోట్ల బకాయి ఉంది. వీటిలో మెజారిటీ నిధిని ట్రస్టీ విస్ట్రా ఐటీసీఎల్ ఇండియా కింద జారీ చేసిన బాండ్ల ద్వారా సమీకరించింది.