• Skip to main content
  • Skip to secondary menu
  • Skip to primary sidebar
Tolivelugu తొలివెలుగు – Latest Telugu Breaking News

Tolivelugu తొలివెలుగు - Latest Telugu Breaking News

Tolivelugu News provide Latest Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, TG and AP News Headlines Live (తెలుగు తాజా వార్తలు), Telugu News Online (తెలుగు తాజా వార్తలు)

tolivelugu facebook tolivelugu twitter tolivelugu instagram tolivelugu tv subscribe nowtolivelugu-app
  • తెలుగు హోమ్
  • వీడియోస్
  • రాజకీయాలు
  • వేడి వేడిగా
  • ఫిలిం నగర్
  • E-Daily
  • చెప్పండి బాస్
  • ENGLISH
Tolivelugu Latest Telugu Breaking News » రాజకీయాలు » కేసీఆర్ అవినీతికి అవధులు లేవు- రేవంత్‌

కేసీఆర్ అవినీతికి అవధులు లేవు- రేవంత్‌

Last Updated: May 5, 2022 at 5:16 pm

శుక్రవారం తెలంగాణ పర్యటనకు వస్తున్నారు కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ. వరంగల్‌ లో రైతు సంఘర్షణ సభలో పాల్గొననున్నారు. ఈ సందర్భంగా ఆ సభకు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి. ప్రజా గాయకుడు గద్దర్.. గాంధీ కుటుంబంపై రూపొందించిన రైతు సంఘర్షణ సభ దృశ్య కావ్యాన్ని కాంగ్రెస్ నేతలతో కలిసి ప్రసాద్ ల్యాబ్స్ ​లో ప్రారంభించారు. కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని.. వచ్చాక రైతులకు ఏం చేయబోతున్నామనే డిక్లరేషన్ ప్రకటిస్తామని అన్నారు. బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు రైతులను మోసం చేస్తున్నాయని మండిపడ్డారు.

వడ్లు కొనమని రైతులు అడుగుతుంటే ధర్నాల పేరుతో రెండు పార్టీలు నాటకాలు ఆడుతున్నాయని ఫైరయ్యారు రేవంత్‌. రైతులపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్య ధోరణిని ఎండగట్టేందుకు రాహుల్ గాంధీ రాష్ట్రానికి వస్తున్నారని స్పష్టం చేశారు. రాబోయే సోనియమ్మ రాజ్యంలో అభివృద్ధి చేసి చూపిస్తామన్నారు. పీవీ నరసింహారావు, మన్మోహన్ సింగ్ లాంటి గొప్ప నాయకులను దేశానికి అందించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదని.. అధికారంలోకి వచ్చాక 2004 నాటి అద్భుతమైన పాలన అందిస్తామని చెప్పారు.

రైతులకు మళ్ళీ అన్ని రకాల సబ్సిడీలు అందిస్తామని తెలిపారు రేవంత్‌. వరంగల్ సభకు రాష్ట్రంలోని రైతులందరూ తరలి రావాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై చేయబోతున్న ఈ యుద్దానికి అండగా నిలబడాలని కోరారు. ప్రతీ బూత్‌ ఎన్ రోలర్ 9 మందిని సభకు తీసుకురావాలని అన్నారు.

కేసీఆర్ అవినీతికి అవధులు లేవని విమర్శించారు రేవంత్‌. యాదగిరి నరసింహ స్వామి ఆలయ నిర్మాణంలో కూడా అవినీతి జరిగిందని ఆరోపించారు. రెండు వేల కోట్లతో నిర్మించిన దేవాలయంలో కూడా కేసీఆర్ కుటుంబ అవినీతి దాగివుందని మండిపడ్డారు. యాదగిరి నరసింహ స్వామి కూడా కేసీఆర్ కుటుంబానికి బలైపోయారని అన్నారు. ఆఖరికి అమరవీరుల స్థూపంలో కూడా అవినీతి జరిగిందన్న రేవంత్‌.. 62 కోట్లతో మొదలు పెట్టిన స్థూపం.. 2 వందల కోట్లు చెల్లించినా పుర్తి కాలేదని చెప్పారు. కేసీఆర్ కుటుంబం ఆస్తులు నిజాం వారసుల సంపదను మించిపోయాయని విమర్శలు చేశారు.

tolivelugu news - follow on google news
tolivelugu app download


Primary Sidebar

తాజా వార్తలు

బ్రేకింగ్… మరో పరువు హత్య.. 20 సార్లు పొడిచారు!

పంజాబ్ రైతులకు సాయం.. కేసీఆర్ డ్రామా

రేపు ఆలేరులో రచ్చబండ కార్యక్రమాలు!

ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్ మధ్య తేడా ఏంటీ…?

వేడి వేడి పాన్ మీద నీళ్ళు పోయడం కరెక్టేనా…?

వీసా స్పాన్సర్ చేయడం అంటే ఏంటీ…?

మరో భారీ మ‌ల్టీస్టార‌ర్ మూవీ..!

న‌న్ను క్ష‌మించండి.. అభిమానుల‌కు ఎన్టీఆర్ క్ష‌మాప‌ణ‌..!

శేఖర్ మూవీ రివ్యూ

లాలూ ప్ర‌సాద్ ఇంట్లో సీబీఐ దాడులు..!

దేశ ప‌ర్య‌ట‌న‌కు కేసీఆర్..!

పీకే ప్లాన్ షురూ..!!

ఫిల్మ్ నగర్

మరో భారీ మ‌ల్టీస్టార‌ర్ మూవీ..!

మరో భారీ మ‌ల్టీస్టార‌ర్ మూవీ..!

న‌న్ను క్ష‌మించండి.. అభిమానుల‌కు ఎన్టీఆర్ క్ష‌మాప‌ణ‌..!

న‌న్ను క్ష‌మించండి.. అభిమానుల‌కు ఎన్టీఆర్ క్ష‌మాప‌ణ‌..!

శేఖర్ మూవీ రివ్యూ

శేఖర్ మూవీ రివ్యూ

సరోగసీ ద్వారా పిల్లలకు జన్మనిచ్చిన సినీ స్టార్స్ ఎవరో తెలుసా ?

సరోగసీ ద్వారా పిల్లలకు జన్మనిచ్చిన సినీ స్టార్స్ ఎవరో తెలుసా ?

చిన్నగౌను వేసుకున్న పెద్దపాప

చిన్నగౌను వేసుకున్న పెద్దపాప

సురేఖతో పెళ్లికి చిరు తండ్రి ఒప్పుకోలేదట!! కానీ

సురేఖతో పెళ్లికి చిరు తండ్రి ఒప్పుకోలేదట!! కానీ

ఎన్టీఆర్ ఇంటి ముందు.. అభిమానుల హంగామా..!

ఎన్టీఆర్ ఇంటి ముందు.. అభిమానుల హంగామా..!

ఆ అగ్రహీరోలపై కేసులు నమోదు...!

ఆ అగ్రహీరోలపై కేసులు నమోదు…!

Download Tolivelugu App Now

tolivelugu app download

Copyright © 2022 · Tolivelugu.com

About Us | Disclaimer | Contact Us | Feedback | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap

ToliVelugu News provide Latest Telugu Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, Telangana and AP News Headlines Live, Latest Telugu News Online (తెలుగు తాజా వార్తలు)