• Skip to main content
  • Skip to secondary menu
  • Skip to primary sidebar
Latest Telugu Breaking News - Flash News in AP & Telangana

Latest Telugu Breaking News - తొలివెలుగు - Tolivelugu

ToliVelugu News provide Latest Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, TG and AP News Headlines Live (తెలుగు తాజా వార్తలు), Telugu News Online (తెలుగు తాజా వార్తలు)

tolivelugu app - latest telugu news app
tolivelugu facebook tolivelugu twitter tolivelugu instagram tolivelugu tv subscribe nowtolivelugu-app
  • తెలుగు హోమ్
  • వీడియోస్
  • రాజకీయాలు
  • వేడి వేడిగా
  • ఫిలిం నగర్
  • చెప్పండి బాస్
  • ENGLISH

అబద్దాలు చెప్పినందుకు అమరుల స్థూపం దగ్గర కాల్చాలి

Published on : August 29, 2019 at 11:22 am

హైదరాబాద్ : అబద్ధాలు చెప్పిన జెన్‌కో ప్రభాకర్‌రావుని అమరుల స్తూపం దగ్గర కాల్చినా తప్పు లేదని కాంగ్రెస్ ఎంపీ రేవంత్‌రెడ్డి తీవ్రంగా విమర్శించారు. రూ.3.90లకే విద్యుత్ వస్తుందని ప్రభాకర్‌రావు పచ్చి అబద్ధాలు చెబుతున్నాడని దుయ్యబట్టారు. కేసీఆర్ దోపిడీకి ప్రభాకర్‌రావు సహకరిస్తున్నాడని ఆరోపించారు. రేవంత్‌ ఇంకా ఏమన్నారంటే…..

  • తప్పుడు ఒప్పందాల మీద ప్రభాకర్‌రావు సంతకాలు చేస్తున్నారు.
  • పదవి కాలం ముగిసిన వారిని కీలకమైన స్థానంలో నియమించి కేసీఆర్ దోపిడీ చేస్తున్నారు
  • గతంలో ప్రభుత్వం జెన్కో, డిస్కం, పంపిణీ సంస్థలకు సీనియర్ ఐఏఎస్‌లను సీఎండీలుగా నియమించేది.
  • కానీ తెలంగాణ ప్రభుత్వం అర్హత లేని ప్రభాకర్‌రావుని నియమించి దోపిడీకి పాల్పడుతోంది.
  • విద్యుత్ సెంటిమెంట్‌ను కేసీఆర్ నోట్ల మూటలను కట్టలు కట్టుకోవడానికి వినియోగించుకుంటున్నారు.
  • చత్తీస్‌గఢ్ నుంచి దీర్ఘకాలిక విద్యుత్ కొనుగోలు ఒప్పందం వల్ల వేల కోట్ల అదనపు భారం పడింది.
  • ఈ ఒప్పందంలో లొసుగులున్నాయని అప్పటి సెక్రటరీ అరవింద్ కుమార్ లేఖ రాశారు.
  • దాంతో ఆయన్ను బదిలీ చేశారు.
  • చత్తీస్‌గఢ్ నుంచి 1000 మెగావాట్ల కొనుగోలు వెనుక అదాని కంపెనీ ఉంది.
  • కొనుగోలు ఒప్పందం చేసుకున్న మార్వా విద్యుత్ ఉత్పత్తి కేంద్రానికి అదాని కంపెనీ బొగ్గు సరఫరా చేస్తుంది.
  • అదాని కంపెనీకి మేలు చేయడానికి తెలంగాణ ప్రజల మీద 1200 కోట్ల భారాన్ని మోపారు.
  • ఓపెన్ బిడ్డింగ్ ద్వారా కొనుగోలు చేస్తే తక్కువ ధరకు విద్యుత్ దొరికేది..
  • విద్యుత్‌లో నాలుగు రకాల ఒప్పందాలు ఉంటాయి.
  • అత్యవసర విద్యుత్ కొనుగోళ్ల పేరిట కూడా దోపిడీ చేస్తున్నారు.
  • 28వ తేదీన ఆరు రూపాయల ఎనిమిది పైసలకు యూనిట్ కొనుగోలు చేశారు.
  • అమ్మేవాళ్లు, కొనేవాళ్లు సిండికేట్‌గా మారి అత్యవసర కొనుగోళ్ల పేరుతో దోపిడీ చేస్తున్నారు.
  • 2016-17లో ఒప్పందం చేసుకుని విద్యుత్ వినియోగించుకోకపోవడం వల్ల 957 కోట్ల నష్టం జరిగింది.
  • అదనపు ఒప్పందం చేసుకుని విద్యుత్ సంస్థలకు వేల కోట్లు చెల్లిస్తున్నారు.ఇదో రకమైన దోపిడీ.
  • తక్కువ ధరకు 4000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసి సరఫరా చేస్తామని ఎన్టీపీసీ చెబుతుంటే దానికి స్థలం కేటాయించడం లేదు.
  • ఏపీ జెన్కో సరఫరా చేస్తామంటే ఒప్పుకోకుండా 4.90 రూపాయలు పెట్టి కొనుగోలు చేసేందుకు ప్రైవేట్ సంస్థల వద్దకు వెళ్లారు.
  • ఏపీ జెన్కో 4.62కె సరఫరా చేస్తామని లేఖ రాసింది.
  • కేసీఆర్ అవినీతి మీద మేము ఫిర్యాదు చేస్తాం.
  • విచారణ జరిపించడానికి లక్ష్మణ్, నడ్డా, కిషన్‌రెడ్డి సిద్ధమా అని సవాల్ విసురుతున్నా..
  • నా ఆరోపణలు తప్పయితే ఏ శిక్షకైనా నేను సిద్ధం.
  • టీఆర్ఎస్, బీజేపీ డ్రామాలు ఆపాలి.
  • సీబీఐ విచారణకు బీజేపీని అడ్డుకుంటుంది ఎవరు..?
  • తెలంగాణ ఏర్పడ్డ తర్వాత విద్యుత్ కొనుగోళ్లలో జరిగిన గోల్‌మాల్‌పై విచారణ జరిపించాలి.
tolivelugu app download

Filed Under: వేడి వేడిగా

Primary Sidebar

ఫిల్మ్ నగర్

సూర్య డైరెక్ట‌ర్ తో మ‌హేష్ బాబు...?

సూర్య డైరెక్ట‌ర్ తో మ‌హేష్ బాబు…?

భారీ బ‌డ్జెట్ తో నెట్ ఫ్లిక్స్ దూకుడు

భారీ బ‌డ్జెట్ తో నెట్ ఫ్లిక్స్ దూకుడు

కెరీర్ బెస్ట్ డీల్ తో బాల‌య్య

కెరీర్ బెస్ట్ డీల్ తో బాల‌య్య

క‌రోనా ఎఫెక్ట్- టాలీవుడ్ సెల్ఫ్ లాక్ డౌన్

క‌రోనా ఎఫెక్ట్- టాలీవుడ్ సెల్ఫ్ లాక్ డౌన్

ఏపీలో మ‌ళ్లీ 50శాతం ఆక్యుపెన్సీతో థియేట‌ర్లు

ఏపీలో మ‌ళ్లీ 50శాతం ఆక్యుపెన్సీతో థియేట‌ర్లు

Advertisement

Download Tolivelugu App Now

tolivelugu app download

అవీ ఇవీ …

నాసిక్‌లో ఆక్సిజ‌న్ లీక్.. 22 మంది రోగులు మృతి

నాసిక్‌లో ఆక్సిజ‌న్ లీక్.. 22 మంది రోగులు మృతి

హే గాంధీ.. మూడు రోజుల్లో 220 మంది మృతి?

హే గాంధీ.. మూడు రోజుల్లో 220 మంది మృతి?

వేరియంట్ ఎదైనా కోవాగ్జిన్ చెక్ పెడుతుంద‌న్న ఐసీఎంఆర్

వేరియంట్ ఎదైనా కోవాగ్జిన్ చెక్ పెడుతుంద‌న్న ఐసీఎంఆర్

కోవిషీల్డ్ వ్యాక్సిన్ ఒక్కో డోసు ధ‌ర ఇక‌పై ఎంతంటే..

కోవిషీల్డ్ వ్యాక్సిన్ ఒక్కో డోసు ధ‌ర ఇక‌పై ఎంతంటే..

మున్సిప‌ల్ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌కే ప్ర‌భుత్వం మొగ్గు

మున్సిప‌ల్ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌కే ప్ర‌భుత్వం మొగ్గు

తిరుమ‌ల స‌ప్త‌గిరుల్లోనే హ‌నుమంతుడి జ‌న‌నం

తిరుమ‌ల స‌ప్త‌గిరుల్లోనే హ‌నుమంతుడి జ‌న‌నం

Copyright © 2021 · Tolivelugu.com

About Us | Disclaimer | Contact Us | Feedback | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap

ToliVelugu News provide Latest Telugu Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, Telangana and AP News Headlines Live, Latest Telugu News Online (తెలుగు తాజా వార్తలు)