తెలంగాణలో రైతు ఆత్మహత్యలు లేవని, ప్రస్తుతం జీరో అయ్యాయన్న ముఖ్యమంత్రి కేసీఆర్ అన్న వ్యాఖ్యలపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్పందించారు. సోషల్ మీడియా వేదికగా సీఎం కేసీఆర్ పై మండి పడ్డారు.
”ఒకటైతే నిజం..పచ్చి అబద్దాన్ని కూడా ఇదే నిజం అనిపించేలా చెప్పడంలో నిన్ను మించినోడు లేడు కేసీఆర్! తెలంగాణలో రైతులు ఉరికొయ్యలకు వేలాడుతున్న లెక్కలు ఎన్సీఆర్బీ రికార్డుల్లో భద్రంగా ఉన్నాయి.
లెక్కకు రానివి ఇంతకు పదింతలు. ‘రైతు స్వరాజ్య వేదిక’ సమక్షంలో ఇద్దరం కూర్చుందాం. ఆత్మహత్యలు లేవన్న నీ మాటల్లో నిజమెంతో నిగ్గుతేల్చుదాం. కేసీఆర్..సిద్ధమా?! అంటూ రేవంత్ ట్వీట్ చేశారు.
శనివారం మహారాష్ట్ర షెట్కారీ సంఘటన్ (రైతు సంఘం) నేతలు తెలంగాణ భవన్ లో కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా మాట్లాడిన కేసీఆర్ రాష్ట్రంలో ఆత్మహత్యలు లేవన్న విషయాన్ని తాను గర్వంగా చెప్పగలుగుతానన్నారు. దీని పై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి.