• Skip to main content
  • Skip to secondary menu
  • Skip to primary sidebar
tolivelugu-logo-removebg-preview

Tolivelugu తొలివెలుగు

Tolivelugu News provide Latest Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, TG and AP News Headlines Live (తెలుగు తాజా వార్తలు), Telugu News Online (తెలుగు తాజా వార్తలు)

tolivelugu facebook tolivelugu twitter tolivelugu instagram tolivelugu tv subscribe nowtolivelugu-app
  • తెలుగు హోమ్
  • వీడియోస్
  • రాజకీయాలు
  • వేడి వేడిగా
  • ఫిలిం నగర్
  • E-Daily
  • చెప్పండి బాస్
  • ENGLISH
Tolivelugu Latest Telugu Breaking News » రాజకీయాలు » వాళ్లిద్దరే అని కేటీఆర్ ఎలా చెప్తారు?

వాళ్లిద్దరే అని కేటీఆర్ ఎలా చెప్తారు?

Last Updated: March 19, 2023 at 3:10 pm

– పేపర్ లీకేజ్ ను నిరసిస్తూ రేవంత్ దీక్ష
– కేటీఆర్‌ కు ఆయన పీఏ షాడో మంత్రి
– రాజశేఖర్ కు ఉద్యోగం వచ్చింది కేటీఆర్ పీఏ వల్లే!
– మంత్రిని జైల్లో పెట్టాలని డిమాండ్

పేపర్ లీకేజ్ వ్యవహారంపై మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. మంత్రి కేటీఆర్ పీఏ తిరుపతి చెప్పడంతోనే నిందితుడు రాజశేఖర్‌ కు టీఎస్పీఎస్సీలో ఉద్యోగం వచ్చిందని ఆరోపించారు. పేపర్ లీక్ వ్యవహారం అంతా నడిపింది కేటీఆర్ పీఏ తిరుపతినే అని సంచలన ఆరోపణలు చేశారు. కామారెడ్డి జిల్లా గాంధారి మండల కేంద్రంలో రేవంత్ నిరుద్యోగ నిరసన దీక్ష చేపట్టారు.

revanth protest pressmeet in sangareddy

దీక్షలో భాగంగా మీడియాతో మాట్లాడారు రేవంత్. కేటీఆర్‌ ను కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయడం కాదని.. చంచల్ గూడ జైల్లో పెట్టాలని అన్నారు. లీకేజ్ వ్యవహారంపై సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. ఇందులో కేవలం ఇద్దరికి మాత్రమే సంబంధం ఉందని కేటీఆర్ ఎలా చెబుతారని ప్రశ్నించారు. కేసీఆర్‌ కు కేటీఆర్ షాడో సీఎం అయితే.. కేటీఆర్‌ కు ఆయన పీఏ షాడో మంత్రి అంటూ మండిపడ్డారు.

2015 నుండి ఇప్పటి వరకు జరిగిన పోటీ పరీక్షలో కొందరికి లబ్ధి జరిగిందని ఆరోపించారు రేవంత్. గ్రూప్-1 ప్రిలిమ్స్‌ లో వందకు పైగా మార్కులు వచ్చిన అందరి వివరాలు బయటపెట్టాలని డిమాండ్ చేశారు. కేటీఆర్ పీఏ, నిందితుడు రాజశేఖర్‌ ఊర్లు పక్కపక్కనే అని.. వారిద్దరికి సన్నిహితులైన వారికి అత్యధిక మార్కులు వచ్చాయని వివరించారు. దీనిపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు.

అసలు, టీఎస్పీఎస్సీలో పనిచేస్తూ పోటీ పరీక్షలు ఎలా రాస్తారని ప్రశ్నించారు రేవంత్ రెడ్డి. గతంలో ఇలాగే గ్రూప్-2 రాసిన మాధురికి ఫస్ట్ ర్యాంక్.. రజినీకాంత్ అనే వ్యక్తికి 4వ ర్యాంక్ వచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా వివరించారు రేవంత్ రెడ్డి. పేపర్ లీక్ వ్యవహారంపై సీబీఐ లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలని కాంగ్రెస్ ముందునుంచి డిమాండ్ చేస్తోంది. ఈ క్రమంలోనే రేవంత్ దీక్షకు పూనుకున్నారు.

మరోవైపు ఈ వ్యవహారంపై తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్‌ శ్రేణులు ఆందోళనలకు దిగాయి. అన్ని మండల కేంద్రాల్లో ధర్నాలకు, దిష్టిబొమ్మల దగ్ధానికి రేవంత్‌ పిలుపునివ్వడంతో రోడ్డెక్కారు నేతలు.

Primary Sidebar

తాజా వార్తలు

నాలుగేళ్ల చిన్నారి పై వీధి కుక్కల దాడి!

నేను ఆరోగ్యంగానే ఉన్నాను: కోట!

ఎప్పుడూ ఎందుకు అదే అడుగుతున్నారు: రష్మిక!

వడగళ్ల వాన ప్రభావిత జిల్లాల్లో సీఎం పర్యటన!

విపక్ష సమైక్యత కల్లే .. బీజేపీకి జైకొట్టిన పీకే

సంతోషానికి చిరునామా ఫిన్లాండ్ !

పనివాడికి 10 కోట్ల లాటరీ…!

సూర్య@ చెన్నై టూ ముంబై..ఖరీదైన ఇల్లు కొనుగోలు..!

బాలయ్యకు జోడీగా కాజల్ అగర్వాల్ రీ ఎంట్రీ..!

ఉగాదికి వస్తున్నాడోయ్ మన రంగమార్తాండ..!

ఏజెంట్ కు నాటు హీరోల ప్రమోషన్…!

నేను అలా చెప్పడం ఆపను.. రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు..!

ఫిల్మ్ నగర్

kota srinivasa rao is healthy

నేను ఆరోగ్యంగానే ఉన్నాను: కోట!

rashmika tired with saami saami step

ఎప్పుడూ ఎందుకు అదే అడుగుతున్నారు: రష్మిక!

సూర్య@ చెన్నై టూ ముంబై..ఖరీదైన ఇల్లు కొనుగోలు..!

సూర్య@ చెన్నై టూ ముంబై..ఖరీదైన ఇల్లు కొనుగోలు..!

బాలయ్యకు జోడీగా కాజల్ అగర్వాల్ రీ ఎంట్రీ..!

బాలయ్యకు జోడీగా కాజల్ అగర్వాల్ రీ ఎంట్రీ..!

ఉగాదికి వస్తున్నాడోయ్ మన రంగమార్తాండ..!

ఉగాదికి వస్తున్నాడోయ్ మన రంగమార్తాండ..!

ఏజెంట్ కు నాటు హీరోల ప్రమోషన్...!

ఏజెంట్ కు నాటు హీరోల ప్రమోషన్…!

డెవిల్ కి దడపుట్టించనున్న ఎల్నాజ్ నోరౌజీ స్పెషల్ సాంగ్ ...!

డెవిల్ కి దడపుట్టించనున్న ఎల్నాజ్ నోరౌజీ స్పెషల్ సాంగ్ …!

actress mrunal thakur movie remuneration

సీతమ్మ ఒక్క సినిమాకే అంత డిమాండా?

Download Tolivelugu App Now

tolivelugu app download

Copyright © 2023 · Tolivelugu.com

About Us | Disclaimer | Contact Us | Feedback | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap