• Skip to main content
  • Skip to secondary menu
  • Skip to primary sidebar
tolivelugu-logo-removebg-preview

Tolivelugu తొలివెలుగు

Tolivelugu News provide Latest Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, TG and AP News Headlines Live (తెలుగు తాజా వార్తలు), Telugu News Online (తెలుగు తాజా వార్తలు)

tolivelugu facebook tolivelugu twitter tolivelugu instagram tolivelugu tv subscribe nowtolivelugu-app
  • తెలుగు హోమ్
  • వీడియోస్
  • రాజకీయాలు
  • వేడి వేడిగా
  • ఫిలిం నగర్
  • E-Daily
  • చెప్పండి బాస్
  • ENGLISH
Tolivelugu Latest Telugu Breaking News » Local News » అన్నదాతల ఆత్మహత్యలపై రేవంత్ బహిరంగ లేఖ!

అన్నదాతల ఆత్మహత్యలపై రేవంత్ బహిరంగ లేఖ!

Last Updated: December 31, 2022 at 6:55 pm

టీపీసీసీ రేవంత్ రెడ్డి మరోసారి ముఖ్యమంత్రి కేసీఆర్ కు బహిరంగ లేఖ రాశారు. పత్తికి మద్దతు ధర కల్పించడంతో పాటు రైతు సమస్యలను అందులో వివరించారు. పండించిన పంటలకు మద్దతు ధర దక్కకుండా దళారులు రైతులను మోసం చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం కనీసం స్పందించడం లేదని రేవంత్ రెడ్డి మండిపడ్డారు.

దళారుల రాజ్యంలో గిట్టుబాటు ధర రాక అన్నదాతలు రోడ్డెక్కి ఆందోళన చేయాల్సిన పరిస్థితి దాపురించిందని ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ విధానాల ఫలితంగా రాష్ట్ర వ్యాప్తంగా సగటున రోజుకు ఇద్దరు అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని అన్నారు. రైతు ఆత్మహత్యల్లో తెలంగాణ నాలుగో స్థానంలో ఉందని జాతీయ క్రైం బ్యూరో లెక్కలు చెబుతున్నాయని ఆయన ఫైర్ అయ్యారు. ఈ నివేదిక ప్రకారం గత 2014 నుంచి 2021 వరకు రాష్ట్రవ్యాప్తంగా 6,557 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని ఈ ఏడాదిలో నవంబర్ వరకు రాష్ట్రంలో 512 మంది రైతులు బలవంతంగా ప్రాణాలు తీసుకున్నారని ఆరోపించారు.

అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకుంటుంటే ప్రభుత్వానికి చీమ కుట్టినట్టుగా కూడా లేదన్నారు. అయితే ఎక్కవగా కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని.. ప్రభుత్వం వారి కోసం ఏం చేయడం లేదన్నారు. ఈ సందర్భంగా 5 డిమాండ్లతో ఆయన కేసీఆర్ కు లేఖ రాశారు. పత్తికి క్వింటాల్ కు 15 వేలు చెల్లించాలని, తక్షణమే లక్ష రుణమాఫీ చేయాలని, ఆత్మహత్యలకు పాల్పడ్డ రైతు కుటుంబాల ప్రైవేట్ అప్పులను వన్ టైమ్ సెటిల్ చేయాలని, కౌలు రైతులను కూడా రైతులుగా గుర్తించాలని చెప్పారు.

ఇంకా పంట బీమా పథకం వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ పథకం అమలు కాకపోవడంతోనే రైతులకు కనీసం నష్టపరిహారం కూడా అందడం లేదని ఆయన ధ్వజమెత్తారు. ఈ బహిరంగ లేఖ పై ప్రభుత్వం వెంటనే స్పందించక పోతే..క్షేత్ర స్థాయిలో పోరాటం ఉంటుందని రేవంత్ రెడ్డి హెచ్చరించారు.

Primary Sidebar

తాజా వార్తలు

ప్రభాస్ ప్రాజెక్ట్ కె. కు సంబంధించిన ఆ న్యూస్ ఫేక్?

అయోధ్య రాముడి విగ్రహం కోసం నేపాల్ శాలిగ్రామ శిలలు

రేపటి నుంచి ఈ మార్గాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు!

జమ్ములో భారీగా హిమపాతం..స్తంభించిన జనజీవనం..!

త్వరలోనే సూర్య 42 సినిమా టైటిల్‌!

14 ఏళ్ల తరువాత విజయ్‌ తో త్రిష!

కియారా పెళ్లి ముహూర్తం ఫిక్స్‌!

ఆటోనగర్‌ టైర్ల గోడౌన్‌ లో మంటలు!

టీడీపీ నేత పై కాల్పులు.. ప్రత్యర్థుల పనే!

నగరంలో మరో అగ్ని ప్రమాదం!

ఇన్వెస్టర్లకు సొమ్ములు తిరిగిచ్చేస్తాం .. అదానీ గ్రూప్

కీవీస్ ను చిత్తుగా ఓడించి టీ20 సిరీస్ సొంతం చేసుకున్న భారత్..!

ఫిల్మ్ నగర్

ప్రభాస్ ప్రాజెక్ట్ కె. కు సంబంధించిన ఆ న్యూస్ ఫేక్?

ప్రభాస్ ప్రాజెక్ట్ కె. కు సంబంధించిన ఆ న్యూస్ ఫేక్?

త్వరలోనే సూర్య 42 సినిమా టైటిల్‌!

త్వరలోనే సూర్య 42 సినిమా టైటిల్‌!

14 ఏళ్ల తరువాత విజయ్‌ తో త్రిష!

14 ఏళ్ల తరువాత విజయ్‌ తో త్రిష!

కియారా పెళ్లి ముహూర్తం ఫిక్స్‌!

కియారా పెళ్లి ముహూర్తం ఫిక్స్‌!

చీరకట్టులో కుందనపు బొమ్మలా కనిపిస్తున్న బుట్టబొమ్మ..!

చీరకట్టులో కుందనపు బొమ్మలా కనిపిస్తున్న బుట్టబొమ్మ..!

దుబాయ్ లో జంటగా దర్శనమిచ్చిన  విజయ్ దేవరకొండ,రష్మిక..!

దుబాయ్ లో జంటగా దర్శనమిచ్చిన విజయ్ దేవరకొండ,రష్మిక..!

ఇన్నాళ్ళకు సోషల్ మీడియాలో మెరిసిన సాయిపల్లవి... !!

ఇన్నాళ్ళకు సోషల్ మీడియాలో మెరిసిన సాయిపల్లవి… !!

‘భారతీయుడు 2’ షూటింగ్ కి చాపర్ లో వస్తున్న కమల్

‘భారతీయుడు 2’ షూటింగ్ కి చాపర్ లో వస్తున్న కమల్

Download Tolivelugu App Now

tolivelugu app download

Copyright © 2023 · Tolivelugu.com

About Us | Disclaimer | Contact Us | Feedback | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap