సీఎం కేసీఆర్ పై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మరోసారి విమర్శలు చేశారు. ఈ మేరకు ఆయన ట్వీటర్ వేదికగా పలు ఆరోపణలు చేశారు. ఓ పత్రికలో వచ్చిన కథనం ఆధారంగా రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. అధికారం ఉన్నదే దోచుకోవడానికి, కబ్జాలు చేయడానికి అన్నట్టు బరితెగించి.. తెగబడుతున్న టీఆర్ఎస్ నేతల అవినీతి పరాకాష్ఠకు చేరిందన్నారు.
మున్సిపల్ శాఖ మంత్రి గారూ.. అక్రమ నిర్మాణాలలో మీ వాటా ఎంత..? అని ప్రశ్నించారు. ఇప్పటికైనా అక్రమార్కులపై సమాన చర్యలు తీసుకుంటారా…? అంటూ రేవంత్ రెడ్డి ప్రశ్నిస్తూ ట్వీట్ చేశారు.
హైదరాబాద్ లోని బోడుప్పల్, పీర్జాదీగూడ్ ప్రాంతాల్లో ఇష్టమొచ్చినట్లుగా అక్రమ నిర్మాణలు వెలుస్తున్నాయన్నాయన్నారు. జవహార్ నగర్ లో ఓ మంత్రికి చెందిన ఆస్పత్రి వెలిసిందని ఓ ప్రధాన పత్రికలో కథనం వచ్చింది. అనుమతుల్లేకుండా ఎత్తైన భవనాలు కడుతున్నారని.. అయినా జీహెచ్ఎంసీ అధికారులు ఆవైపు చూడడం లేదని పత్రికలో రాశారు. అక్రమ నిర్మాణాల కూల్చివేత జాబితాలో కూడా కనీసం ఆ నిర్మాణాలను చేర్చలేదని ఆ వార్తలో వివరించారు.
దీంతో ఈ అంశంపై తెలంగాణ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్పందించారు. ఆ కథనానికి సంబంధించిన క్లిప్ లను ట్విటర్ లో జత చేస్తూ ట్విట్ చేశారు. అందులో కేటీఆర్ ను నిలదీస్తూ అక్రమ కట్టడాలలో నీ వాటా ఎంత అంటూ రాశారు. ఇప్పుడు అది వైరల్ గా మారింది.