ఆహ్లాదకరంగా సాగుతున్న పర్యటనలో ఒక్కసారిగా ఊహించని సంఘటన చోటు చేసుకుంది. వాహనంలో వెళ్తున్న వారి వైపు ఒక్కసారిగా ఖడ్గమృగాలు దూసుకొచ్చాయి. వాటి నుంచి తప్పించుకునే క్రమంలో వాహనం బోల్తా పడి పర్యాటకులు గాయపడిన ఘటన బంగాల్ ఆలీపుర్ ద్వార్ జిల్లాలోని జల్దాపరా నేషనల్ పార్క్లో చోటు చేసుకుంది.
పార్క్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం..శనివారం ఆరుగురు పర్యాటకులు, ఒక గైడ్, డ్రైవర్ తో ఉన్న వాహనం జల్దాపరా నేషనల్ పార్క్ ని సందర్శిస్తున్నారు. ఈ క్రమంలో ఒక్కసారిగా వారి వైపునకు రెండు ఖడ్గమృగాలు దూసుకొని వచ్చాయి.
వాటి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో వాహనం బోల్తా పడింది. ఘటనలో మొత్తం ఐదుగురు గాయపడ్డారు. ప్రస్తుతం వీరంతా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.