పదిగ్రామాల ప్రజలను తన భుజాలపై మోసిన ఐరన్ బ్రిడ్జ్ కుప్పకూలింది. బిహార్ లోని ధర్బాంగ జిల్లాలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
బ్రిడ్జ్ పై నుంచి భారీ లోడ్తో ఓ లారీ వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. వెంటనే అప్రమత్తమైన లారీ డ్రైవర్ నీటిలోకి దూకి తన ప్రాణాలు కాపాడుకోగలిగాడు.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. గ్రామస్థుల సాయంతో లారీని బయటకు తీసే ప్రయత్నాలు చేపట్టారు.
ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని పోలీసులు వెల్లడించారు. దాదాపు 10 గ్రామాలను కలిపే ఈ వంతెన తెగిపోవడంతో ప్రజా రవాణాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.