• Skip to main content
  • Skip to secondary menu
  • Skip to primary sidebar
tolivelugu-logo-removebg-preview

Tolivelugu తొలివెలుగు

Tolivelugu News provide Latest Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, TG and AP News Headlines Live (తెలుగు తాజా వార్తలు), Telugu News Online (తెలుగు తాజా వార్తలు)

tolivelugu facebook tolivelugu twitter tolivelugu instagram tolivelugu tv subscribe nowtolivelugu-app
  • తెలుగు హోమ్
  • వీడియోస్
  • రాజకీయాలు
  • వేడి వేడిగా
  • ఫిలిం నగర్
  • E-Daily
  • చెప్పండి బాస్
  • ENGLISH
Tolivelugu Latest Telugu Breaking News » Local News » కరెంట్ కోసం రోడ్డెక్కిన అన్నదాతలు

కరెంట్ కోసం రోడ్డెక్కిన అన్నదాతలు

Last Updated: February 9, 2023 at 9:37 pm

వ్యవసాయ రంగానికి 24 గంటలు ఉచిత విద్యుత్ అంశం ఇటు అసెంబ్లీని షేక్ చేస్తుంటే..అటు రైతులు ధర్నాకు దిగారు. కన్నెపల్లి మండల కేంద్రంలోని కేవీ విద్యుత్ ఉపకేంద్రం ప్రధాన రహదారి పై గురువారం రైతులు ధర్నాకు దిగారు. ప్రభుత్వానికి నిరసనగా నినాదాలు చేశారు.

బెల్లంపల్లి, దహేగం మండలం వెళ్లే రహదారిపై రెండు గంటల పాటు ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది ఎదుర్కొన్నారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ ప్రభుత్వం రైతుల కోసం 24 గంటల ఉచిత విద్యుత్ ఉత్తదేనని మండిపడ్డారు. మండల కేంద్రానికి కరెంట్ అసలు ఇవ్వడం లేదని, ఉదయం నుంచి సాయంత్రం వరకు కనీసం రెండు మూడు గంటల కరెంటు సరఫరా కూడా ఇవ్వడం లేదన్నారు.

యాసంగి వరి సాగు, కూరగాయల పంటలకు నీరు లేక ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. తమను ప్రభుత్వం హామీలతోనే సరిపెడుతోందని, కనీసం బెల్లంపల్లిలో ఉన్న ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య కూడా తమ బాధలు పట్టించుకోవడం లేదని రైతులు ఆరోపించారు. విద్యుత్ అధికారులు వచ్చేంత వరకు ఇక్కడ నుంచి కదిలేది లేదంటూ రైతులు భీష్మించుకు కూర్చున్నారు.

ఆయా మండలాల నుంచి మంచిర్యాల జిల్లా ఆస్పత్రులకు వెళ్లడానికి ప్రయాణికులు ఇబ్బందిపడ్డారు. పెళ్లి శుభకార్యాల కోసం వెళ్లేవారు సైతం అక్కడే ఉండియారు. ఎంత నచ్చచెప్పినా వినకుండా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గంట తర్వాత విద్యుత్ ఏఈ రావడంతో మండల కేంద్రానికి అసలు విద్యుత్ సరఫరా ఇవ్వడం లేదని రైతులు నిలదీశారు. అనంతరం ఫోన్ ద్వారా ఏడీ రాంచందర్ కు సమాచారం అందించడంతో అక్కడికి చేరుకున్న ఏడీ తో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ మాట్లాడారు.

దీంతో కొంత సేపు ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. కరెంటు ఇస్తానని మాట ఇస్తేనే ఇక్కడి నుంచి కదలమని చెప్పడంతో స్పందించిన విద్యుత్ ఏడీ రైతులను రిప్రజెంటేషన్ ఇవ్వాలని కోరారు. పై స్థాయి అధికారులకు చెప్పి సమస్య పరిష్కారం అయ్యేలా చూస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ధర్నా విరమించారు.

Primary Sidebar

తాజా వార్తలు

50 యేళ్ల వయసులో శాంతి కోసం సైకిల్ యాత్ర …!

లేడీ సీఆర్పీఎఫ్ ల వినూత్న బైక్ ర్యాలీ..!

‘పఠాన్’ పాటకు స్టెప్పులేసిన క్రికెటర్ పఠాన్ కొడుకు..!

రంగమార్తాండ బ్రహ్మానందానికి మెగాభినందనలు…!

నువ్వు ‘దసరా’, నేను ‘రావణాసుర’ …సెల్ఫమేడ్ స్టార్స్ చిట్ చాట్..!

‘విరూపాక్ష’ లిరికల్ వీడియో సాంగ్ అప్డేట్…!

తీన్మార్ మల్లన్న ఎఫ్ఐఆర్ కాపీ సినిమాలా ఉంది: పాల్

ఆహారంలో కోతులు నాకు ఆదర్శం అంటున్న అదాశర్మ..!

IPL 2023 ప్రారంభ వేడుకల్లో రష్మిక,తమన్న ఆటపాట..!

రేవంత్, బండి సంజయ్ లకు కేటీఆర్ లీగల్ నోటీసులు

మైత్రీ మూవీస్ తెచ్చిన ‘ఖుషి’ కబురు…రిలీజ్ డేట్ తో లవ్లీ పోస్టర్…!

వైసీపీకి ఊహించని షాక్.. టీడీపీ అభ్యర్థి విజయం

ఫిల్మ్ నగర్

'పఠాన్’ పాటకు స్టెప్పులేసిన క్రికెటర్ పఠాన్ కొడుకు..!

‘పఠాన్’ పాటకు స్టెప్పులేసిన క్రికెటర్ పఠాన్ కొడుకు..!

రంగమార్తాండ బ్రహ్మానందానికి మెగాభినందనలు...!

రంగమార్తాండ బ్రహ్మానందానికి మెగాభినందనలు…!

నువ్వు ‘దసరా’, నేను ‘రావణాసుర’ …సెల్ఫమేడ్ స్టార్స్ చిట్ చాట్..!

నువ్వు ‘దసరా’, నేను ‘రావణాసుర’ …సెల్ఫమేడ్ స్టార్స్ చిట్ చాట్..!

‘విరూపాక్ష’ లిరికల్ వీడియో సాంగ్ అప్డేట్...!

‘విరూపాక్ష’ లిరికల్ వీడియో సాంగ్ అప్డేట్…!

ఆహారంలో కోతులు నాకు ఆదర్శం అంటున్న అదాశర్మ..!

ఆహారంలో కోతులు నాకు ఆదర్శం అంటున్న అదాశర్మ..!

IPL 2023 ప్రారంభ వేడుకల్లో రష్మిక,తమన్న ఆటపాట..!

IPL 2023 ప్రారంభ వేడుకల్లో రష్మిక,తమన్న ఆటపాట..!

మైత్రీ మూవీస్ తెచ్చిన ‘ఖుషి’ కబురు...రిలీజ్ డేట్ తో లవ్లీ పోస్టర్...!

మైత్రీ మూవీస్ తెచ్చిన ‘ఖుషి’ కబురు…రిలీజ్ డేట్ తో లవ్లీ పోస్టర్…!

gunasekhar apeaks about jewellery used in shaakunthalam movie

శాకుంతలం కోసం ఎన్ని కిలోల బంగారం వాడారంటే!

Download Tolivelugu App Now

tolivelugu app download

Copyright © 2023 · Tolivelugu.com

About Us | Disclaimer | Contact Us | Feedback | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap