రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో ప్రచార కార్యక్రమాల్లో భాగంగా ఒక్కో రాష్ట్రాన్ని కవర్ చేస్తోంది ఆర్ఆర్ఆర్ టీమ్. శనివారం రాత్రి కర్నాటకలో ఎంతో గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిపింది. సీఎం బొమ్మై, కన్నడ స్టార్ శివ రాజ్ కుమార్ హాజరయ్యారు. అయితే.. తాజాగా గుజరాత్ టూర్ కు వెళ్లింది.
ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన స్టాచ్యూ ఆఫ్ యూనిటీ.. పటేల్ విగ్రహాన్ని సందర్శించింది ఆర్ఆర్ఆర్ టీమ్. దీంతో అక్కడ సందడి వాతావరణం నెలకొంది. మీడియా ప్రతినిధులు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్ బరోడా ఎయిర్ పోర్టు నుంచి కెవాడియా వెళ్లేందుకు ప్రత్యేకంగా డిజైన్ చేసిన వాహనాలను ఉపయోగించారు. ఆ కార్లపై ఆర్ఆర్ఆర్ పేరు, రిలీజ్ డేట్, హీరోల చిత్రాలను ముద్రించారు.
పటేల్ విగ్రహం దగ్గర ఎన్టీఆర్, చరణ్ దిగిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Renowned film director @ssrajamouli & actors N T Rama Rao Jr. & Ram Charan visited Statue of Unity today. In their message they said we need to remind ourselves about virtues of Sardar Patel. It takes an ‘iron will’ to build such a statue, they added. @tarak9999 @AlwaysRamCharan pic.twitter.com/7wyijNr6u8
— Statue Of Unity (@souindia) March 20, 2022
Advertisements