కేంద్రం ప్రకటించిన 20 లక్షల కోట్ల ప్రత్యేక ప్యాకేజి వల్ల పేదలకు వచ్చే లాభం ఏమీ లేదన్నారు ఏపీసీసీ నేత సుంకర ప్రద్మశ్రీ. కార్మికులను, వలస కూలీలను , రైతులను పట్టించుకోకుండా… కేవలం పారిశ్రామిక వర్గాలను మాత్రమే కేంద్రం పట్టించుకుందని ఆరోపించారు .20 లక్షల కోట్లకు ఎన్ని సున్నాలు ఉంటాయో అర్థం కాక జుట్టు పీక్కుంటున్న పేదలు ఆకలితో అలమటిస్తున్నారన్నారు.
2014 నుండి అంధ్రప్రదేశ్ కు ఒక లక్ష కోట్లు ఇచ్చాము అని కాకి లెక్కలు చూపించినట్లుగానే ఈ 20 లక్షల కోట్ల ప్యాకేజి ఉందని విమర్శించారు . కేంద్రం ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీ వల్ల పేదలకు ఒరిగిందేమి లేదన్నారు .మరో సారి సూటు – బూటు సర్కారు అని మోడీ ప్రభుత్వం నిరూపించుకుందన్నారు ఇది ప్రజా ప్రభుత్వంకాదన్నారు పద్మశ్రీ.
వలస కూలీల పైన కరుణించని.. మోడీ సంస్కరణల పేరుతో ఉన్న ఉపాధి పోగొట్టేలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.
దేశంలో వలస కూలీలు సొంత గ్రామాలకు, స్వస్థలాలకు వెళ్లలేక ఇబ్బందులు పడుతుంటే.. వారికి సౌకర్యాలు కల్పించకుండా నానా ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు .
అంతేకాదు యతారాజ… తథా సీఎం అన్నట్లుగా రాష్ట్రంలో జగన్ పాలన కొనసాగుతుందని జగన్ తీరును ఎండగట్టారు .వివిధ రాష్ట్రాల్లో ఉన్న వలస కూలీలను తీసుకురావడం… రాష్ట్రంలో ఉన్న వలస కూలీలను వారి స్వస్థలాలకు పంపడం చేతకాదు కానీ , విదేశాల్లో ఉన్న వారిని తీసుకురావాలని లేఖలు రాస్తున్నారని జగన్ పై ధ్వజమెత్తారు .