రూ.10 పార్కింగ్ ఫీజు అడిగినందుకు రూ.50వేల జరిమానా వేశారు అధికారులు. ఒక కస్టమర్ నుంచి అక్రమంగా పార్కింగ్ ఫీజు వసూలు చేసినందుకు.. ఆ మాల్ పై రూ.50 వేల ఫైన్ జీహెచ్ఎంసీ అధికారులు విధించారు.
హైదరాబాద్ లోని బేగంపేట మెట్రో స్టేషన్ సమీపంలోని మై హోమ్ టైకూన్ షాపింగ్ మాల్ పై ఈ ఫైన్ పడింది. ఒక కస్టమర్ నుంచి అక్రమంగా పార్కింగ్ రుసుము రూ.10 వసూలు చేసినందుకు జీహెచ్ఎంసీ ఎన్ఫోర్స్మెంట్ విజిలెన్స్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ విభాగం షాపింగ్ మాల్ పై జరిమానా విధించింది.
జీహెచ్ఎంసీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. జే సురానా అనే వ్యక్తి సోషల్ మీడియాలో ఇచ్చిన ఫిర్యాదు మేరకు షాపింగ్ షాపింగ్ మాల్ పై చర్యలు తీసుకున్నామని అధికారులు తెలిపారు. తెలంగాణ అపార్ట్మెంట్స్ యాక్ట్స్ అండ్ రూల్స్, 1987లోని 28, 24, జీవో168 ప్రకారం కస్టమర్ బిల్ చూపించినా కూడా పార్కింగ్ ఫీజును వసూలు చేయడం చట్టవిరుద్ధం.
ఈ విషయం తెలిసినా మైహోమ్ టైకూన్ మాల్ సురానా అనే వ్యక్తి నుంచి నుంచి పార్కింగ్ ఫీజు వసూలు చేసింది. దీంతో సురానా ట్విట్టర్ ద్వారా.. జీహెచ్ ఎంసీకి కంప్లైంట్ ఇచ్చారు. ఈ మేరకు అధికారులు ఫైన్ విధించినట్టు తెలిపారు.