• Skip to main content
  • Skip to secondary menu
  • Skip to primary sidebar
tolivelugu-logo-removebg-preview

Tolivelugu తొలివెలుగు

Tolivelugu News provide Latest Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, TG and AP News Headlines Live (తెలుగు తాజా వార్తలు), Telugu News Online (తెలుగు తాజా వార్తలు)

tolivelugu facebook tolivelugu twitter tolivelugu instagram tolivelugu tv subscribe nowtolivelugu-app
  • తెలుగు హోమ్
  • వీడియోస్
  • రాజకీయాలు
  • వేడి వేడిగా
  • ఫిలిం నగర్
  • E-Daily
  • చెప్పండి బాస్
  • ENGLISH
Tolivelugu Latest Telugu Breaking News » Top News » ఢిల్లీ అసెంబ్లీలో రభస..బీజేపీ ఎమ్మెల్యేల వినూత్న నిరసన

ఢిల్లీ అసెంబ్లీలో రభస..బీజేపీ ఎమ్మెల్యేల వినూత్న నిరసన

Last Updated: January 16, 2023 at 2:24 pm

ఢిల్లీ అసెంబ్లీలో సోమవారం పాలక, విపక్ష సభ్యుల వాగ్వాదాలతో పెద్దఎత్తున రభస జరిగింది. బీజేపీ ఎమ్మెల్యేలు ఆక్సిజన్ సిలిండర్లు పట్టుకుని, ముఖాలకు ఆక్సిజన్ మాస్కులు ధరించి అసెంబ్లీకి వచ్చారు. నగరంలో వాయు కాలుష్యాన్ని అదుపు చేయడంలో ఆప్ ప్రభుత్వం విఫలమైనందుకు నిరసనగా తాము వీటితో వచ్చామని వారు చెప్పారు. సీఎం అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం అత్యంత కాలుష్య నగరాల్లో ఢిల్లీ కూడా ఉందని వారన్నారు.

Ruckus in Delhi Assembly as BJP MLAs carry oxygen cylinders, wear oxygen masks

నగరంలోని సుమారు 2 కోట్ల మంది ప్రజలు తప్పనిసరిగా గ్యాస్ ఛాంబర్ లో నివసించే పరిస్థితి వస్తోందని, దీన్ని నివారించేందుకు ఆప్ ప్రభుత్వం ఏం చేస్తోందో చెప్పాలని బీజేపీ ఎమ్మెల్యే విజేంద్ర గుప్తా నిలదీశారు. అయితే ఆప్ ఎమ్మెల్యేలు ఆయనపై విరుచుకుపడుతూ .. వాతావరణ సమస్యలను కూడా బీజేపీ రాజకీయం చేస్తోందని ఆరోపించారు. ఆక్సిజన్ సిలిండర్లను బయటకు తీసుకువెళ్లాలని, సెక్యూరిటీ ఉన్నప్పటికీ మీరు వీటిని సభ లోకి ఎలా తీసుకువచ్చారని స్పీకర్ రామ్ నివాస్ గోయెల్ ..బీజేపీ సభ్యులనుద్దేశించి ఆగ్రహంగా వ్యాఖ్యానించారు. అటు ఆప్ సభ్యులు కూడా పెద్దగా నినాదాలు చేయడంతో సభ వేడెక్కింది.

ప్రభుత్వ వ్యవహారాల్లో లెఫ్టినెంట్ గవర్నర్ సక్సేనా జోక్యం చేసుకుంటున్నారని ఆప్ సభ్యులు చేసిన ఆరోపణను బీజేపీ ఎమ్మెల్యేలు ఖండిస్తూ వారితో వాగ్యుధ్ధానికి దిగారు. శిక్షణ కోసం టీచర్లను ఫిన్లాండ్ వెళ్లేందుకులెఫ్టినెంట్ గవర్నర్ అనుమతించడం లేదని ఆప్ నేత సౌరవ్ భరద్వాజ్ ఆరోపించారు.

సభ్యుల ఆరోపణలు, ప్రత్యారోపణల మధ్య స్పీకర్ సభను వాయిదా వేశారు. అనంతరం ఆప్ ఎమ్మెల్యేలు అసెంబ్లీ నుంచి లెఫ్టినెంట్ గవర్నర్ నివాసం వరకు కాలినడకన బయల్దేరారు. ఢిల్లీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు మూడు రోజులు జరగనున్నాయి. నగరంలో వాతావరణ కాలుష్యంపై పోరాటాన్ని తాము తీవ్రతరం చేస్తామని బీజేపీ హెచ్చరించింది.

Primary Sidebar

తాజా వార్తలు

ఓరి వీడి భయం బంగారం గానూ…అమ్మాయిల్ని చూసి..!

ఫోటోలు పెట్టింది.. ట్రోలర్స్‌కి చిక్కింది!

కేసీఆర్ కు షూ చూపిస్తూ షర్మిల సవాల్

ఆయన బదిలీపై సంబరాలు..ఈయన బదిలీ వద్దంటూ నిరసనలు!

శ్రీకాకుళంలో వింత డ్రోన్‌ కలకలం!

నగరానికి చేరుకున్న యువ క్రికెటర్లు!

రంగంలోకి దిగిన ఆర్బీఐ.. స్థానిక బ్యాంకులతో టచ్ !

నగ ఎత్తుకెళ్ళిన నాటీ ఎలుక…!

దాని పై దృష్టి పెడితే భారత్ నెం.1

ఎలాంటి విచారణ అయినా సిద్ధమే!

ఉభయ సభల్లో బీఆర్ఎస్ వాయిదా తీర్మానాలు

రైట్‌ హ్యాండ్ నుంచి లెఫ్ట్‌ హ్యాండ్‌!

ఫిల్మ్ నగర్

ఫోటోలు పెట్టింది.. ట్రోలర్స్‌కి చిక్కింది!

ఫోటోలు పెట్టింది.. ట్రోలర్స్‌కి చిక్కింది!

సీనియర్‌ డైరెక్టర్‌ సాగర్‌ మృతి!

సీనియర్‌ డైరెక్టర్‌ సాగర్‌ మృతి!

ప్రభాస్ ప్రాజెక్ట్ కె.. అది ఫేక్ న్యూస్..!

ప్రభాస్ ప్రాజెక్ట్ కె.. అది ఫేక్ న్యూస్..!

త్వరలోనే సూర్య 42 సినిమా టైటిల్‌!

త్వరలోనే సూర్య 42 సినిమా టైటిల్‌!

14 ఏళ్ల తరువాత విజయ్‌ తో త్రిష!

14 ఏళ్ల తరువాత విజయ్‌ తో త్రిష!

కియారా పెళ్లి ముహూర్తం ఫిక్స్‌!

కియారా పెళ్లి ముహూర్తం ఫిక్స్‌!

చీరకట్టులో కుందనపు బొమ్మలా కనిపిస్తున్న బుట్టబొమ్మ..!

చీరకట్టులో కుందనపు బొమ్మలా కనిపిస్తున్న బుట్టబొమ్మ..!

దుబాయ్ లో జంటగా దర్శనమిచ్చిన  విజయ్ దేవరకొండ,రష్మిక..!

దుబాయ్ లో జంటగా దర్శనమిచ్చిన విజయ్ దేవరకొండ,రష్మిక..!

Download Tolivelugu App Now

tolivelugu app download

Copyright © 2023 · Tolivelugu.com

About Us | Disclaimer | Contact Us | Feedback | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap