తన అందచందాలతో సౌత్ ఇండియాని షేక్ చేస్తున్న పూజాహెగ్డేకి ఇప్పుడు బాలీవుడ్ కూడా దర్వాజా తెరిచింది. నిజానికి పూజ సినీ కెరీర్ బాలీవుడ్ నుంచే ప్రారంభమైన సంగతి తెలిసిందే.గతంలో అప్పటికే బాలీవుడ్లో పాతుకు పోయిన భామల్ని దాటుకుని అవకాశాలు పూజా దాకా రాకపోవడంతో పూజా ముకుందాతో తెలుగు తెరంగేట్రం చేసింది.
తొలుత అంతగా అవకాశాలు రాకున్నా ఆమెకున్న క్యూట్ లుక్ కన్సిస్టెన్స్ క్యారెక్టరైజేషన్ ఇప్పడు భారీసినిమా భామగా తెలుగు తెరను ఉర్రూతలూగిస్తుంది. ప్రస్తుతం తెలుగు తెరకు ఉన్న రెప్యుటేషన్ బాలీవుడ్లో పూజకు స్పెషల్ ఇమేజ్ తెచ్చిపెట్టింది. ప్రస్తుతం ఆమె బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ సరసన ‘కిసీ కా భాయ్ కిసీ కీ జాన్’ అనే చిత్రంలో నటిస్తోంది.
BREAKING NEWS : New Couple in Town !!! Mega Star #SalmanKhan fell in love with #PoojaHegde !! His production house also signed her for next 2 films !! They are spending time together now a days !! Confirmed by Salman Khan close sources. pic.twitter.com/2lkNIXH3IE
— Umair Sandhu (@UmairSandu) December 7, 2022
ఈచిత్రంలోవిక్టరీవెంకటేశ్ గెస్ట్ రోల్ చేస్తున్నారు. మరోవైపు, పూజా హెగ్డే పర్సనల్ లైఫ్ గురించి బాలీవుడ్ క్రిటిక్ ఉమైర్ సంధూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం పూజా హెగ్డే, సల్మాన్ ఖాన్ మధ్య అఫైర్ కొనసాగుతోందని ఆయన ట్వీట్ చేశారు. పూజ ప్రేమలో సల్మాన్ పడిపోయాడని.. ప్రస్తుతం ఇద్దరూ కలిసి ఎక్కువ సమయాన్ని గడుపుతున్నారని చెప్పారు. సల్మాన్ ఖాన్ ప్రొడక్షన్స్ పూజకు మరో రెండు సినిమాల్లో అవకాశం ఇచ్చిందని తెలిపారు.
ఈ విషయం సల్మాన్ అంత్యంత సన్నిహితవర్గాలనుంచి తనకుతెలిసిందనిచెప్పారు. సల్మాన్ కు హీరోయిన్లతో అఫైర్లు కొత్తేమీ కాదు. ఐశ్వర్య రాయ్ తో పాటు పలువురు హీరోయిన్లతో ప్రేమాయణాలు నడిపారు. ఇప్పుడు పూజతో అఫైర్ నిజమేనా? అనే విషయంపై పూర్తి క్లారిటీ రావాల్సి ఉంది.