• Skip to main content
  • Skip to secondary menu
  • Skip to primary sidebar
Tolivelugu తొలివెలుగు – Latest Telugu Breaking News

Tolivelugu తొలివెలుగు - Latest Telugu Breaking News

Tolivelugu News provide Latest Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, TG and AP News Headlines Live (తెలుగు తాజా వార్తలు), Telugu News Online (తెలుగు తాజా వార్తలు)

tolivelugu facebook tolivelugu twitter tolivelugu instagram tolivelugu tv subscribe nowtolivelugu-app
  • తెలుగు హోమ్
  • వీడియోస్
  • రాజకీయాలు
  • వేడి వేడిగా
  • ఫిలిం నగర్
  • E-Daily
  • చెప్పండి బాస్
  • ENGLISH
Tolivelugu Latest Telugu Breaking News » National » రాజ్యసభలో కన్నీరు పెట్టుకున్న రూపా గంగూలీ

రాజ్యసభలో కన్నీరు పెట్టుకున్న రూపా గంగూలీ

Last Updated: March 25, 2022 at 4:04 pm

రాజ్యసభలో పశ్చిమ బెంగాల్‌కు చెందిన బీజేపీ ఎంపీ రూపా గంగూలీ కట్టతడి పెట్టుకున్నారు. ఆమె బీర్భూమ్ హింసాకాండను తలచుకుని శుక్రవారం రాజ్యసభలో భావోద్వేగానికి గురయ్యారు. రాజకీయ హింసలో అమాయకులు బలవుతున్నారని బాధపడ్డారు. బెంగాల్‌ను కాపాడాలని, రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని రూపా గంగూలీ సభలో కేంద్రానికి విజ్ఞప్తి చేశారు.

పశ్చిమ బెంగాల్‌‌లోని బీర్భూమ్ హింసాత్మక ఘటన దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై కలకత్తా హైకోర్టు సీబీఐ విచారణకు ఆదేశించింది. ఈ కేసుకు సంబంధించిన నివేదికను ఏప్రిల్ 7లోగా సమర్పించాలని కోర్టు ఆదేశించింది. ఈ క్రమంలో ఎంపీ రూపా గంగూలీ శుక్రవారం జీరో అవ‌ర్‌లో ఈ అంశాన్ని లేవనేత్తారు. కేవ‌లం 8 మంది మాత్రమే మ‌ర‌ణించార‌ని, అంత క‌న్నా ఎక్కువ లేద‌ని ఆమె బెంగాల్ ప్రభుత్వాన్ని ప‌రోక్షంగా విమ‌ర్శించారు.

అలాగే, అటాప్సీ రిపోర్ట్ ప్ర‌కారం తొలుత అక్క‌డ వాళ్ల‌ను కొట్టిన‌ట్లు తెలుస్తోంద‌న్నారు. కొట్టిన త‌ర్వాత సామూహిక హ‌త్య‌లు జ‌రిగిన‌ట్లు రూపా ఆరోపించారు. భార‌త్‌లో బెంగాల్ భాగ‌మ‌ని, అక్క‌డ జీవించే హ‌క్కు ఉంద‌ని, మేం బెంగాల్‌లో పుట్టామ‌ని, అక్క‌డ పుట్ట‌డం త‌ప్పుకాదు అని, మ‌హాకాళి భూమి అని ఆమె ఆవేశంగా మాట్లాడారు. భావోద్వేగంతో ఏడ్చేశారు.

దీంతో రూపా గంగూలీ మాట్లాడుతున్న స‌మ‌యంలో తృణ‌మూల్ ఎంపీలు స‌భ‌లో ఆందోళ‌న సృష్టించారు. ఆ సమయంలో స‌భ‌లో గంద‌ర‌గోళం నెల‌కొంది. తృణ‌మూల్ ఎంపీలు నినాదాల‌తో హోరెత్తించారు. దీంతో స‌భ‌ను వాయిదా వేశారు.

పశ్చిమ బెంగాల్‌లోనిబీర్భూమ్‌లో జరిగిన హింసాకాండ తర్వాత మమత ప్రభుత్వం దీనిపై దర్యాప్తు చేసేందుకు సిట్‌ని ఏర్పాటు చేసింది. అయితే ఈ మొత్తం వ్యవహారంపై సీబీఐ విచారణ జరిపించాలని బీజేపీ డిమాండ్ చేసింది.

tolivelugu news - follow on google news
tolivelugu app download


Primary Sidebar

తాజా వార్తలు

కేసీఆర్ మద్యం.. ఆరోగ్యానికి హానికరం!

రాకీబాయ్ లా మారాడు.. ఆస్పత్రిలో చేరాడు!

వేలేరు పీఎస్ నుంచి మల్లన్న విడుదల

వంద నాణెంపై ఎన్టీఆర్ ఫోటో.. ఆర్బీఐతో చ‌ర్చిస్తున్నాం..!

చెప్పేదొక‌టి.. చేసేదొక‌టి..!

చ‌దువు రాని వారికేం తెలుసు.. ప‌రీక్ష‌ల విలువ‌..!

నువ్వా..నేనా ! టఫ్ టైటాన్స్.. రఫ్ రాయల్స్

భార‌త తీరంలో.. విహార నౌక..!

సావర్కర్ బయోపిక్… అదిరిపోయిన ఫస్ట్ లుక్..!

బ్రేకింగ్‌… మల్లన్న అరెస్ట్‌

టీఆర్‌ఎస్‌ లో ముసలం.. మంత్రి పనేనా?

కలెక్టరేట్ ఎదుట కాళేశ్వరం బాధితుల ఆందోళన..చివరకు!

ఫిల్మ్ నగర్

kgf 2 dialogues

రాకీబాయ్ లా మారాడు.. ఆస్పత్రిలో చేరాడు!

సావర్కర్ బయోపిక్... అదిరిపోయిన ఫస్ట్ లుక్..!

సావర్కర్ బయోపిక్… అదిరిపోయిన ఫస్ట్ లుక్..!

అర్జున్ రెడ్డి.. త్వ‌ర‌లో రెండ‌వ భాగం..!

అర్జున్ రెడ్డి.. త్వ‌ర‌లో రెండ‌వ భాగం..!

డ్రెస్ తో తంటాలు.. ఇమేజ్ ఢమాల్..!

డ్రెస్ తో తంటాలు.. ఇమేజ్ ఢమాల్..!

ఒక్క విమర్శ తట్టుకోలేవా రావిపూడి!

ఒక్క విమర్శ తట్టుకోలేవా రావిపూడి!

త్రివిక్రమ్ ను నన్ను ఎవ్వరూ విడదీయలేరు

త్రివిక్రమ్ ను నన్ను ఎవ్వరూ విడదీయలేరు

కరోనా తర్వాత అతి తక్కువ టికెట్ రేట్లు ఇవే

కరోనా తర్వాత అతి తక్కువ టికెట్ రేట్లు ఇవే

ఎఫ్4 ప్రాక్టికల్ గా వర్కవుట్ అవుతుందా?

ఎఫ్4 ప్రాక్టికల్ గా వర్కవుట్ అవుతుందా?

Download Tolivelugu App Now

tolivelugu app download

Copyright © 2022 · Tolivelugu.com

About Us | Disclaimer | Contact Us | Feedback | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap

ToliVelugu News provide Latest Telugu Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, Telangana and AP News Headlines Live, Latest Telugu News Online (తెలుగు తాజా వార్తలు)