• Skip to main content
  • Skip to secondary menu
  • Skip to primary sidebar
tolivelugu-logo-removebg-preview

Tolivelugu తొలివెలుగు

Tolivelugu News provide Latest Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, TG and AP News Headlines Live (తెలుగు తాజా వార్తలు), Telugu News Online (తెలుగు తాజా వార్తలు)

tolivelugu facebook tolivelugu twitter tolivelugu instagram tolivelugu tv subscribe nowtolivelugu-app
  • తెలుగు హోమ్
  • వీడియోస్
  • రాజకీయాలు
  • వేడి వేడిగా
  • ఫిలిం నగర్
  • E-Daily
  • చెప్పండి బాస్
  • ENGLISH
Tolivelugu Latest Telugu Breaking News » International » మొబైల్ ఫోన్ల వాడటంతోనే దొనెట్స్క్ దాడి… !

మొబైల్ ఫోన్ల వాడటంతోనే దొనెట్స్క్ దాడి… !

Last Updated: January 4, 2023 at 2:16 pm

దొనెట్స్క్‌లో ఇటీవల రష్యా సైన్యానికి భారీ ఎదురు దెబ్బ తగిలింది. ఉక్రెయిన్ జరిపిన క్షిపణి దాడిలో వందల మంది రష్యా సైనికులు మరణించారు. దీనిపై రష్యా మరోసారి స్పందించింది. నూతన సంవత్సరం రోజున సైనికులు నిబంధనలు ఉల్లంఘించి మొబైల్ ఫోన్లను వినియోగించడంతోనే ఈ దాడి జరిగినట్టు పేర్కొంది.

ఈ ఘటనలో 89 మంది సైనికులు మరణించినట్టు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. నూతన సంవత్సరం రోజున తూర్పు దొనెట్స్క్‌ ప్రాంతంలో రష్యా సైనికులు బస చేశారు. అదే సమయంలో ఆ శిబిరంపై ఉక్రెయిన్ క్షిపణి దాడులు చేసింది.

ఈ దాడుల్లో వందల మంది రష్యన్ సైనికులు మరణించారని ఉక్రెయిన్‌ వెల్లడించింది. కానీ 63 మంది మాత్రమే మరణించినట్టు రష్యా మొదట ప్రకటించింది. ఈ ఘటన నేపథ్యంలో రష్యన్ మిలిటరీ కమాండర్లపై ఆ దేశ ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో రక్షణ శాఖ స్పందించింది.

మకివ్కాలోని వొకేషనల్ కాలేజీలో రష్యా సైనికులు బస చేశారని రష్యా లెఫ్టినెంట్‌ జనరల్ సెర్గీ సెవ్ర్యుకోవ్‌ తెలిపారు. కాలేజీపై ఉక్రెయిన్‌ నాలుగు క్షిపణులను ప్రయోగించిందన్నారు. దాడికి ప్రధాన కారణం మొబైల్ ఫోన్ల వినియోగమేనని చెప్పారు. శత్రువుల ఆయుధాల పరిధిలో ఉన్నప్పుడు ఫోన్లపై నిషేధం ఉంటుందన్నారు. కానీ తమ సైనికులు చాలా మంది మొబైళ్లను ఆన్‌ చేసి ఉపయోగించారని చెప్పారు.

ఈ నేపథ్యంలో తమ సైనికుల సిగ్నల్స్‌ను శత్రువులు ట్రాక్‌ చేశారన్నారు. అందువల్ల తమ సైనికుల కచ్చితమైన లొకేషన్‌ను శత్రువులు గుర్తించి దాడి చేశారని పేర్కొన్నారు. ఈ ఘటనలో 89 మంది సైనికులు మరణించారని వెల్లడించారు. దీనిపై దర్యాప్తు జరుపుతున్నామన్నారు.

ఇలాంటి ఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా చూస్తామని తెలిపారు. ఈ ఘటనలో బాధ్యులకు శిక్ష తప్పదని ఆయన వివరించారు. మృతుల్లో ఎక్కువ మంది రిజర్విస్టులే ఉన్నట్టు తెలుస్తోంది. ఇటీవలే వీరంతా సైన్యంలో చేరి యుద్ధంలో పాల్గొన్నట్లు సమాచారం.

Primary Sidebar

తాజా వార్తలు

కోటం రెడ్డిది ఫోన్ ట్యాపింగ్ కాదు..మ్యాన్ ట్యాపింగ్!

పార్క్ చేసిన బైక్ ను 3 కిలో మీటర్ల దూరం లాక్కెళ్ళిన బే’కారు’..!

ఉద్యోగులకు బైజూస్ షాక్… ఈ సారి ఫ్రెషర్లందరినీ ఇంటికి ….!

ఆయన మృతి చిత్ర పరిశ్రమకు తీరని లోటు!

గాంధీ భవన్ వద్ద ఉద్రిక్తత.. కాంగ్రెస్ నేతలను అడ్డుకున్న పోలీసులు!

బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ఏం మాట్లాడారంటే!

అమెరికాలో స్పై బెలూన్ కలకలం… డ్రాగన్ కంట్రీ గూఢచర్యం చేస్తోందన్న అమెరికా…!

రూ. 9.5 లక్షల విలువైన నకిలీ నాణేల గుట్టురట్టు …!

రామ మందిరం పేల్చేస్తామంటూ ఫోన్ కలకలం

కే విశ్వనాథ్ ఖాకీ డ్రెస్సు వెనుక స్టోరీ ఏంటంటే?

వరంగల్‌ లో భారీ అగ్ని ప్రమాదం..కోటి రూపాయల నష్టం!

పరుపులను ఫలహారంగా తింటున్న అమెరికా అమ్మాయి…!

ఫిల్మ్ నగర్

ఆయన మృతి చిత్ర పరిశ్రమకు తీరని లోటు!

ఆయన మృతి చిత్ర పరిశ్రమకు తీరని లోటు!

కే విశ్వనాథ్ ఖాకీ డ్రెస్సు వెనుక స్టోరీ ఏంటంటే?

కే విశ్వనాథ్ ఖాకీ డ్రెస్సు వెనుక స్టోరీ ఏంటంటే?

కళాతపస్వికి మోడీ నివాళులు!

కళాతపస్వికి మోడీ నివాళులు!

శంకరాభరణం విడుదలైన రోజే.. విశ్వనాథ్‌ కన్నుమూత!

శంకరాభరణం విడుదలైన రోజే.. విశ్వనాథ్‌ కన్నుమూత!

కళాతపస్వికి ప్రముఖుల నివాళులు!

కళాతపస్వికి ప్రముఖుల నివాళులు!

కళాతపస్వికి ''ఎస్‌'' అనే సెంటిమెంట్‌ ఎందుకంటే!

కళాతపస్వికి ”ఎస్‌” అనే సెంటిమెంట్‌ ఎందుకంటే!

టాలీవుడ్ లో విషాదం.. కళాతపస్వి విశ్వనాథ్ కన్నుమూత!

టాలీవుడ్ లో విషాదం.. కళాతపస్వి విశ్వనాథ్ కన్నుమూత!

నటి పాకీజా, కెమెరా మేన్ దేవరాజ్ లకు చిరంజీవి ఆపన్న హస్తం..!

నటి పాకీజా, కెమెరా మేన్ దేవరాజ్ లకు చిరంజీవి ఆపన్న హస్తం..!

Download Tolivelugu App Now

tolivelugu app download

Copyright © 2023 · Tolivelugu.com

About Us | Disclaimer | Contact Us | Feedback | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap