మెగా హీరో సాయి ధరమ్ తేజ్ శుక్రవారం స్పోర్ట్స్ బైక్పై నుంచి ప్రమాదవశాత్తూ కిందపడిపోయారు. ఈ ఘటనలో సాయిధరమ్ తేజ్కు తీవ్రగాయాలు అయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే సాయితేజ్ అపస్మారక స్థితిలో వెళ్లినట్లు తెలుస్తోంది. నగరంలోని కేబుల్ బ్రిడ్జ్-ఐకియా సమీపంలో ఈ ప్రమాదం జరిగింది.
ఘటన గురించి తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ప్రమాద స్థలానికి చేరుకుని, చికిత్స నిమిత్తం సాయిధరమ్ తేజ్ను మెడికవర్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు చికిత్స కొనసాగుతోంది. బైక్పై వేగంగా వెళ్లడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. బైక్ను నియంత్రించలేక అదుపుతప్పి కిందపడిపోయినట్లు మాదాపూర్ సీఐ తెలిపారు. అంతర్గతంగా ఏమైనా గాయాలు అయ్యాయా లేదా అన్న అనుమానంతో సాయిధరమ్ తేజ్కు వైద్యులు స్కాన్ చేస్తున్నారని….ఇక ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేసినట్లు సీఐ తెలిపారు. కాగా తేజ్ కు ఎలాంటి ప్రమాదం లేదని డాక్టర్స్ తెలిపారు.