రెండు రోజుల క్రితం ఓ కార్యక్రమానికి హాజరై తిరిగి వస్తున్న సైఫ్ జంటను.. కెమెరామెన్లు వెంబండించడంతో సైఫ్ అసహనానికి గురైన విషయం తెలిసిందే.అర్ధరాత్రి 2గంటల తరువాత అపార్ట్మెంట్ గేటును దాటి ఫోటో గ్రాఫర్లు లోపలికి వెళ్లారు. దీని పై సైఫ్ సీరియస్ అయ్యాడు. పిక్స్ తీసుకోవడానికి తమ బెడ్రూమ్లోనికి కూడా రావాలని ఘాటుగా వ్యాఖ్యానించాడు.
ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్గా మారాయి. అపార్ట్మెంట్ వాచ్మెన్ను సైఫ్ అలీ ఖాన్ తొలగించాడంటూ పలు వదంతులు షికార్లు కొట్టడం మొదలయ్యాయి. ఫలితంగా ఈ వార్తలన్నింటిపై సైఫ్ అలీ ఖాన్ స్పందించాడు. ‘‘బిల్డింగ్ సెక్యూరిటీ గార్డును తొలగించలేదు. ఈ ఘటనలో సెక్యూరిటీ తప్పేమీ లేదు. ఫొటోగ్రాఫర్స్కు వ్యతిరేకంగా నేను ఎటువంటి చట్టపరమైన చర్యలను తీసుకోవడం లేదు. మేం పార్టీ నుంచి వచ్చే సమయానికి దాదాపుగా 20మంది ఫొటోగ్రాఫర్స్ అక్కడ ఉన్నారు.
మా మీద లైట్స్ను ఫోకస్ చేశారు. అర్ధరాత్రి పూట ఈ విధంగా చేయడం సరైనదేనా..? కెమెరామెన్స్ ప్రవర్తించాల్సిన తీరు కాదిది. ప్రతి ఒక్కరు వారి హద్దుల్లో ఉండాలి. మా ఇంటి బయట ఎల్ల వేళలా ఫొటోగ్రాఫర్స్కు నేను సహకరించాను. వారు మా ప్రైవేట్ స్పేస్లోకి వచ్చి గీతను మితిమీరారు. అందుకే బెడ్ రూం కామెంట్స్ చేయాల్సి వచ్చింది.
పిల్లలు ఆటలు ఆడుతున్నప్పుడు కూడా వీడియోలు షూట్ చేస్తున్నారు. ఈ విధంగా చేయాల్సిన అవసరం లేదు. పాఠశాల లోపలికి రాకూడదు. ఎవరికి నిజం తెలియదు. ప్రతి ఒక్కరు అబద్ధాన్ని నమ్మడానికి ప్రయత్నిస్తున్నారు. అందరికి ధన్యవాదాలు’’ అని సైఫ్ అలీ ఖాన్ తెలిపాడు. ఇక సైఫ్ కెరీర్ విషయానికి వస్తే.. తాజాగా ‘ఆది పురుష్’ లో రావణుడి పాత్రను పోషించారు. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా జూన్ 16 విడుదల కానుంది.