• Skip to main content
  • Skip to secondary menu
  • Skip to primary sidebar
tolivelugu-logo-removebg-preview

Tolivelugu తొలివెలుగు

Tolivelugu News provide Latest Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, TG and AP News Headlines Live (తెలుగు తాజా వార్తలు), Telugu News Online (తెలుగు తాజా వార్తలు)

tolivelugu facebook tolivelugu twitter tolivelugu instagram tolivelugu tv subscribe nowtolivelugu-app
  • తెలుగు హోమ్
  • వీడియోస్
  • రాజకీయాలు
  • వేడి వేడిగా
  • ఫిలిం నగర్
  • E-Daily
  • చెప్పండి బాస్
  • ENGLISH
Tolivelugu Latest Telugu Breaking News » Local News » Andhra Pradesh » పోరాడలేక ఇలా అడ్డదారిలో వస్తున్నారు…!

పోరాడలేక ఇలా అడ్డదారిలో వస్తున్నారు…!

Last Updated: January 9, 2023 at 3:54 pm

టీడీపీ, జనసేన పొత్తులపై వైసీపీ రాష్ట్ర కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతి పక్ష నేతలు ఎందుకంత రహస్యంగా సమావేశమవుతున్నారని ఆయన ప్రశ్నించారు. తమ అక్రమ సంబంధాలను సక్రమం అని చెప్పేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

వైసీపీ అధినేత చేపట్టిన జగన్ ప్రజా సంకల్ప యాత్రకు నాలుగేండ్లు పూర్తయింది. ఈ క్రమంలో తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా వేడుకలను నిర్వహించారు. ఈ వేడుకల్లో వైసీపీ రాష్ట్ర కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి హాజరై మాట్లాడారు.

ముందస్తు ఎన్నికల వార్తలపై ఆయన స్పందించారు. ముందస్తుకు వెళ్లాలన్న ఆళోచనలో సీఎం జగన్ లేరని ఆయన స్పష్టం చేశారు. ఐదేండ్ల కాలానికి ప్రజలు తీర్పునిచ్చారని ఆయన అన్నారు. అందువల్ల పూర్తి కాలం పాటు సీఎం జగన్ పాలిస్తారని ఆయన వివరించారు.

తాము సజీవంగా ఉన్నామని చెప్పేందుకే ప్రతిపక్షాలు ముందస్తు ప్రకటనలు చేస్తున్నాయన్నారు. చంపిన వాళ్ళను పరామర్శించటం ఈ ప్రపంచంలో ఎక్కడైనా జరుగుతుందా అని ఆయన ప్రశ్నించారు. 11 మంది ప్రాణాలు తీసిన వ్యక్తిని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పరామర్శించటం సిగ్గుచేటని ఆయన మండిపడ్డారు.

జనసేన, టీడీపీలు కలిసిపోవడాన్ని వామపక్షాలు స్వాగతించటం చాలా విడ్డూరంగా ఉందన్నారు. బీజేపీ కూడా కలిస్తే మరి వామపక్షాలు ఎలాంటి వైఖరిని అవలంభిస్తాయో చూడాలన్నారు. అప్పుడు ఎరుపు, కాషాయం కలిసి పసుపు అవుతుందేమోనని ఆయన ఎద్దేవా చేశారు.

సిద్ధాంతాలతో కానీ, ప్రజల మీద ప్రేమతో కానీ, విలువలతో కానీ పోరాడలేక ఇలా అడ్డదారిలో వాళ్లు వస్తున్నారని అన్నారు. వాళ్లు పడుతున్న తిప్పలు చూస్తుంటే సీఎం జగన్ మోహన్ రెడ్డి ఎంతో బలవంతుడన్న విషయం తెలుస్తోందని వ్యాఖ్యానించారు.

Primary Sidebar

తాజా వార్తలు

తండ్రికి తగ్గ తనయుడు.. హిమాన్షుపై ప్రశంసలు..!

ముగిసిన ఎంపీ అవినాష్ రెడ్డి సీబీఐ విచారణ

హిండెన్ బర్గ్ రిపోర్ట్: కేటీఆర్, కవితల రియాక్షన్

ముందస్తు హింట్.. సెంట్రల్ కు స్ట్రయిట్ సవాల్

పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపై శ్వేతపత్రం విడుదల చేయాలి

ప్రచారం, ప్రకటనలపై ఏ పార్టీ ఎంత ఖర్చు చేసిందంటే…!

వేలాది మంది భర్తలను కటాకటాల్లోకి నెడతాం….!

మరి మిగతా ధర్మాల మాటేమిటి… సీఎం యోగిపై కాంగ్రెస్ నేత ఫైర్…!

రవితేజ ఉండే ఇల్లు ఖరీదు ఎంతో తెలుసా…?

విజయసాయి రెడ్డికి, తారకరత్నకు ఉన్న రిలేషన్ తెలుసా…?

జమున ఆస్తులు ఎన్నో తెలుసా…?

రజనీ కాంత్ కి ఆ రెండు అలవాట్లు ఉండేవా…? లతా వచ్చిన తర్వాత ఏం జరిగింది…?

ఫిల్మ్ నగర్

ఇంకా విషమంగానే తారకరత్న ఆరోగ్యం!

ఇంకా విషమంగానే తారకరత్న ఆరోగ్యం!

తారకరత్నకు ఎక్మో వైద్యం.. సాయంత్రం బెంగళూరుకి చంద్రబాబు, ఎన్టీఆర్‌, కళ్యాణ్‌రామ్‌!

తారకరత్నకు ఎక్మో వైద్యం.. సాయంత్రం బెంగళూరుకి చంద్రబాబు, ఎన్టీఆర్‌, కళ్యాణ్‌రామ్‌!

వసూళ్లను 'హంట్' చేయలేకపోయింది!

వసూళ్లను ‘హంట్’ చేయలేకపోయింది!

దసరా 2 భాగాలుగా వస్తోందా?

దసరా 2 భాగాలుగా వస్తోందా?

పవన్ సినిమాకు ముహూర్తం ఫిక్స్

పవన్ సినిమాకు ముహూర్తం ఫిక్స్

బుల్లితెరపై మెరిసిన గాడ్ ఫాదర్

బుల్లితెరపై మెరిసిన గాడ్ ఫాదర్

ధోనీ కొత్త ఇన్నింగ్స్ మొదలుపెట్టాడు!

ధోనీ కొత్త ఇన్నింగ్స్ మొదలుపెట్టాడు!

అన్ స్టాపబుల్-2: మూడు పెళ్లిళ్ల గొడవ ఏంటయ్యా?

అన్ స్టాపబుల్-2: మూడు పెళ్లిళ్ల గొడవ ఏంటయ్యా?

Download Tolivelugu App Now

tolivelugu app download

Copyright © 2023 · Tolivelugu.com

About Us | Disclaimer | Contact Us | Feedback | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap