మంత్రులతో ఉద్యోగ సంఘాలకు చెందిన స్టీరింగ్ కమిటీ సభ్యులు భేటీ అయ్యారు. అనంతరం ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణ రెడ్డి మాట్లాడుతూ వారు గతంలో ఇచ్చిన డిమాండ్ లలో ఒకటి ఇక వర్తించదన్నారు. ఎందుకంటే ఇప్పటికే జీవో ప్రకారం కొత్త వేతనాలు వారి ఖాతాల్లో పడిపోయాయని తెలిపారు.
ఓపెన్ మైండ్ తోనే చర్చలు చేస్తున్నామని అన్నారు. వారికి అన్యాయం చేయాలన్న ఉద్దేశ్యం తో ఇలా చేయలేదని తెలిపారు. కొన్ని అంశాలను సర్దుబాటు, మార్పులు చేసే అవకాశం ఉందని పేర్కొన్నారు. రికవరీలు లేవని వారి డిమాండ్ వర్తించదని ఒత్తిడి తెచ్చి ప్రభుత్వం నుంచి ఏదో సాధించాలని ప్రయత్నం చేయడం కూడా సరికాదన్నారు.
హై కోర్టు కూడా అదే వ్యాఖ్యలు చేసిందన్నారు. ఉద్యోగులు చేస్తున్న ఆందోళన లు వాయిదా వేసుకోవాలని కోరుతున్నామన్నారు. ఉద్యోగులను ఎవరూ బెదిరించడం లేదని పీఆర్సీ నివేదిక ను పదే పదే అడగడం ఎందుకని ప్రశ్నించారు.
ఆ నివేదిక ఇస్తే అంతా అయిపోతుందా అని అడిగారు. అసలు చర్చించాల్సిన అంశాలు వదిలి దానిపైనే ఉద్యోగ సంఘాలు ఎందుకు పట్టుబడుతున్నాయో అర్ధం కావడం లేదని అన్నారు.