ఆంధ్రప్రదేశ్ కు కొత్త సీఎస్ గా సమీర్ శర్మను నియమించింది ప్రభుత్వం. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ను జారీ చేసింది. అక్టోబర్ 1న ఆయన పదవీ బాధ్యతలు చేపట్టనున్నారాయన.
ప్రస్తుతం ఉన్న సీఎస్ ఆదిత్యనాథ్ పదవీకాలం ఈనెల 30తో ముగియనుంది. దీంతో సమీర్ శర్మను నియమించింది జగన్ సర్కార్. ఈయన 1985 బ్యాచ్ కు చెందిన ఐఏఎస్ అధికారి. ప్రస్తుతం రాష్ట్ర ప్రణాళిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు.