మాన్సాస్ ట్రస్ట్ అధినేత హిందూయేతర వ్యక్తి అంటూ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై సంచయిత గజపతిరాజు ట్విట్టర్ వేదికగా స్పందించారు. పవన్ కళ్యాణ్ గారు మాన్సాస్ కు హిందూయేతర వ్యక్తి అధినేతగా ఉన్నారని ప్రెస్ కాన్ఫరెన్స్ లో మీరు చెప్పారు. కొన్ని నిజాలను నేను మీకుచెప్పాలనుకుంటున్నాను ఆనందగజపతిరాజు ఉమా గజపతిల కూతురు నేను. నా తల్లిదండ్రులు ఇద్దరూ హిందువులే.
నా తల్లి రమేష్ అనే హిందూ పండిట్ ను రెండో వివాహం చేసుకుంది. ఆయన ఆరు జాతీయ అవార్డులు అందుకున్న ఫిల్మ్ మేకర్. టిడిపి చేస్తున్న తప్పుడు ప్రచారాలను నమ్మవద్దు. సింహాచలం దేవస్థానం ఆడిట్ రిపోర్టులలో తప్పిదాలు బయటపడతాయని భయంతో టిడిపి ఉంది. ఒక హిందువుగా నేను అన్ని మతాలను గౌరవిస్తూ మీ మాటను సవరిస్తూ ఒక ప్రకటన ఇస్తే చంద్రబాబు, ఆయన అనుచరుల ఆరోపణలకు ఫుల్ స్టాప్ పడుతుంది అంటూ ట్వీట్ చేశారు.