ఢిల్లీ: కాంగ్రెస్ నేత శశిథరూర్ శృంగార కథలు ఒక్కొక్కటీ బయటపడుతున్నాయ్. పాక్ జర్నలిస్టు మెహర్ థార్డ్తో అతను దుబాయ్లో మూడు రాత్రులు గడిపినట్టుగా సునంద స్నేహితురాలు, సీనియర్ జర్నలిస్టు నళినీసింగ్ చెప్పినట్టు ఈ కేసులో వాదనలు వినిపిస్తూ.. ప్రాసిక్యూషన్ సంచలన విషయాలను బయటపెట్టింది.
సునందా పుష్కర్ మృతి కేసులో నిందితుడైన కాంగ్రెస్ నేత శశి థరూర్కు వ్యతిరేకంగా ప్రాసిక్యూషన్ ఢిల్లీ కోర్టుకు కొన్ని విషయాలు తెలియజేసింది. జడ్జి అజయ్కుమార్ ముందు ఈ వాంగ్మూలాన్ని పబ్లిక్ ప్రాసిక్యూటర్ అతుల్ శ్రీవాస్తవ చదివి వినిపించారు.‘సునంద నాకు మూడు, నాలుగేళ్లుగా తెలుసు. నిరుటి నుంచే ఆమె తన పర్సనల్ మేటర్స్ నాకు చెప్పడం మొదలుపెట్టింది. దుబాయ్లో మెహర్తో తన భర్త మూడు రాత్రులు గడిపినట్టుగా పుష్కర్ చెప్పింది’ అని నళినీసింగ్ పేర్కొన్నారు. థరూర్, మెహర్ మధ్య శృంగార సందేశాలు నడిచినట్టుగా సునంద చెప్పుకొని ఏడ్చిందని తెలిపారు. భార్య ఆత్మహత్యకు కారకుడైన థరూర్ను ప్రాసిక్యూట్ చేయాల్సిందిగా ఢిల్లీ పోలీసులు కోర్టును కోరారు.